టాలీవుడ్ లో మాటల రచయితగా తన ప్రస్థానం మొదలు పెట్టిన పోసాని కృష్ణ మురళి తర్వాత దర్శక, నిర్మాత సత్తా కొనసాగిస్తూనే నటన వైపు దృష్టి కేంద్రీకరించారు.  నటుడిగా మంచి పొజీషన్లోకి రాగానే..దర్శకత్వానికి గుడ్ బాయ్ చెప్పారు.  విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న పోసాని కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అని తెలిసిందే.  సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం తనదైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెగ హడావుడి సృష్టిస్తుంటారు. ఆ మద్య ఏపిలో ఎన్నికల సందర్భంగా వైసీపీ నేత సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు.  కొంత కాలంగా అనారోగ్యానికి గురైన పోసాని తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. నేడు హీరో నిఖిల్ నటించిన ‘అర్జున్ సురువరం’ మూవీ రిలీజ్ అయ్యింది.

 

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిఖిల్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.  అర్జున్ సురువరం షూటింగ్ సమయంలో దర్శకుడిపై krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి చాలా సీరియస్ కావడం..సెట్స్ నుంచి వెళ్లిపోవడం జరిగిందట. పోసాని తో  వర్క్ చేస్తున్నప్పుడు.. దర్శకుడికి పోసానికి మధ్య గొడవ జరిగిందని.. పోసాని ఏ సీన్ చేసినా.. రెండు, మూడు టేకుల్లో ఓకే అయిపోతుందని.. డైరెక్టర్ మాత్రం 16-17 టేకులు చేయించారని. దాంతో చిర్రెత్తుకొచ్చిన పోసాని నిశ్శబ్దంగా ఉంటూ పక్కకు జరిగారట..దాంతో పరిస్థితి అర్థమై వెంటనే డైరెక్టర్ పోసాని దగ్గరకి వెళ్లి తను ఫస్ట్ టైం డైరెక్టర్ చేస్తున్నానని..దయచేసి తనకు సహకరించాలని కోరడంతో పోసాని కోపం తగ్గించుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడట.

 

'అర్జున్ సురవరం' సినిమా షూటింగ్ సమయంలో ఎప్పుడూ టెన్షన్ పడలేదు కానీ ఒకసారి బాగా టెన్షన్ పడినట్లు ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు నిఖిల్. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి అథిదిగా రావడం జన్మలో మర్చిపోలేనని..ఆయన మమ్ముల్ని దేవుడిలా ఆదుకున్నారని అన్నారు.  ఆయన పక్కన నిలబడి మాట్లాడలంటే..గుండెల్లో వణుకు పుట్టిందని అన్నారు. ఆయన గొప్పదనం గురించి తెలియాలంటే ఆయన్ని దగ్గర నుండి చూడాల్సిందేనని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: