పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తరువాత తన సినిమా లైఫ్ కు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో మునిగిపోయిన పవన్, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున భీమవరం, గాజువాక ప్రాంతాల్లో పోటీ చేసి, ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఘోరంగా ఓటమి పాలవడం జరిగింది. ఇక అక్కడినుండి తన పార్టీ కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్, ప్రజల వద్దకు మరింతగా చేరువయ్యేలా పలు కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఇక అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆయన నుండి ఒక సినిమా చేయాలని కోరుతున్నారు. 

 

అయితే వారి విన్నపాలను పెద్దగా పట్టించుకోని పవన్, ఎట్టకేలకు వారి అబ్యర్ధనను మన్నించి ఒక సినిమాలో నటించడానికి సిద్ధం అయ్యారు. బాలీవుడ్ లో కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన కోర్ట్ డ్రామా మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కబోయే సినిమాలో నటించడానికి పవన్ ఒప్పుకోవడం జరిగింది. బోనీ కపూర్, దిల్ రాజు నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా గురించి ఇటీవల అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. ఇక ఈ సినిమా కోసం ఒక భారీ కోర్ట్ హాల్ సెట్టింగ్ ని కూడా సిద్ధం చేస్తోంది సినిమా యూనిట్. 

 

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేదంటున్నారు. పవన్ కు పలు రాజకీయ కమిట్మెంట్స్ ఉండడం వలన సినిమాను ఇప్పట్లో మొదలెట్టే అవకాశం లేదని అంటున్నారు. దాదాపుగా మార్చిలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనపడుతోందని, అప్పటి వరకు ఆగకతప్పని పరిస్థితి ఉందని అంటున్నారు. కాగా ఒక రకంగా ఈ న్యూస్ పవన్ ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెట్టె న్యూస్ అని, ఎప్పుడెప్పుడు తమ హీరో సినిమా మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇది ఒకరకంగా చేదు వార్త కూడా అనే అనే చెప్పాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: