బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించగల సత్తా అమీర్ ఖాన్ సొంతం. పాత్రకు తగ్గట్టుగా తన బాడీని మలుచుకుంటూ ఉంటాడు. పాత్రలో తను చేసిన నటన కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. పాత్రకు తగ్గ పర్ఫెక్ట్ యాక్షన్ పాత్రకి తగ్గ పర్ఫెక్ట్ బాడీ షేప్ చేసుకోగలడు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్. అయితే హీరోయిన్లు అమీర్ ఖాన్ సరసన ఛాన్స్ వస్తే బాగుండు అనుకుంటారు . ఎవరైనా అమీర్ ఖాన్ సరసన నటించే అవకాశం వస్తే తప్పకుండా నటించడానికి ఓకే చెప్తారు . కాని ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం అమిర్ ఖాన్ సరసన నటించేందుకు అవకాశం వచ్చినప్పటికీ నో అంటూ సమాధానం చెప్పేసిందట . దానికి కారణం కూడా ఉందంట... ఇంతకీ ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే .
గీతాంజలి తర్వాత గిరిజ చేసిన హృదయాంజలి సినిమాకి రచయితగా బీకే ఈశ్వర్ పనిచేసిన విషయం తెలిసిందే . తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరవ్వగా గీతాంజలి హీరోయిన్ గిరిజ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.అప్పట్లో గిరిజ కి జో జీతా వహీ సికందర్ అనే సినిమాలో అమీర్ ఖాన్ సరసన నటించే అవకాశం వచ్చిందని బీకే ఈశ్వర్ తెలిపారు. అయితే అమీర్ఖాన్ సరసన అవకాశం రావడంతో ఈ సినిమాలో నటించేందుకు గిరిజన ఒప్పుకుందని... కానీ ఆ తర్వాత మాత్రం సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిందని ఆయన అన్నారు. అయితే దీనికి కారణం మాత్రం చెప్పలేదని కానీ తర్వాత ఓ సందర్భంలో అడిగినప్పుడు తాను ఆ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం చెప్పిందని బీకే ఈశ్వర్ చెప్పారు.
అయితే అమిర్ ఖాన్ సినిమాలో నటించడానికి అవకాశం వచ్చినప్పటికీ...ఓ అభ్యంతరకర సన్నివేశంలో నటించమని గిరిజ ను దర్శకుడు అడిగారట. అయితే ఆ సన్నివేశంలో తాను నటించనని గిరిజా దర్శకుడితో తెగేసి చెప్పిందట. అయినప్పటికీ దర్శకుడు గిరిజకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారట . ఇక అయినా గిరిజ మొండిపట్టు వీడకపోవడంతో ఏకంగా దర్శకుడు గిరిజన సన్నివేశంలో నటించడానికి భయపెట్టాడు కూడా. చివరికి విషయం కోర్టు వరకు వెళ్లగా కోర్టు నుంచి గిరిజకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఫలితంగా గిరిజకు సినిమా నిర్మాతలు భారీ మొత్తంలోనే చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక ఆ తర్వాత గిరిజ స్థానంలో ఆయేషా జుల్కా నటించిందని చెప్పుకొచ్చాడు.