వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న అల్లు అర్జున్ ...వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన నా పేరు సూర్య దారుణమైన డిజాస్టర్ రావడంతో తర్వాత సినిమా చేయడానికి అల్లు అర్జున్ చాలా టైం తీసుకున్నారు. ఈ క్రమంలో చాలా మంది డైరెక్టర్లు చెప్పిన కథలు విన్న అల్లు అర్జున్ తన కెరియర్ లో అదిరిపోయే రెండు బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన అలా వైకుంఠపురం లో సినిమా స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న క్రమంలో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

 

ఈ సినిమాతో ఎలాగైనా త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ గ్యారెంటీగా హ్యాట్రిక్ విజయం సాధిస్తారు అనే ధీమాలో ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు చాలా సంవత్సరాల తర్వాత రి-ఎంట్రీ ఇవ్వటంతో సినిమాపై ఇండస్ట్రీలో కూడా ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గాసిప్ ఒకటి ఇండస్ట్రీ లో చక్కెర్లు కొడుతుంది. అదేమిటంటే అలా వైకుంఠపురం లో సినిమా స్టోరీ అప్పటి లో సీనియర్ నటుడు ఎన్టీఆర్ నటించిన “ఇంటిగుట్టు” చిత్ర కథని పోలి ఉంటుందన్న గాసిప్ గట్టిగా వినబడుతోంది.

 

అంతేకాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటిదాకా తెరకెక్కిన సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ ని మిస్ చేయలేదు. ఈ చిత్రంలో కూడా అవన్నీ వుంటాయని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ చిత్రాన్ని ఇప్పటితరం ప్రేక్షకులకి అర్థమయ్యేలా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందనేది చిత్రం విడుదల అయ్యేవరకు తెలీదు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన పాటలు మరియు ప్రోమోలు, టీజర్లు సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: