హైదరాబాద్‌లోని తన ఇంటిని అమ్మి బెంగళూరుకు షిఫ్ట్ అవుతున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలను రకుల్ ప్రీత్ సింగ్ ఖండించారు. ఇప్పటికే టాలీవుడ్‌లో తనను తాను నిరూపించుకుంది ఈ పంజాబీ బ్యూటీ, నాగార్జున, చిరంజీవి, అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితర తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులతో రకుల్ నటించింది.టాలీవుడ్లో ఇంతగా క్రేజ్ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నటుండి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మకాం మారుస్తున్నట్లు మీడియా లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఆమె బెంగళూరుకు మకాం మారుస్తున్నట్లు, ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తన ఇంటిని తక్కువ మొత్తానికి అమ్మినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే హైదరాబాద్‌లో తన ఇంటిని అమ్మినట్లు వస్తున్న వార్తలను రకుల్ ఖండించారు.

 

రకుల్ ప్రీత్ సింగ్ జర్నలిస్టులపై మండిపడ్డారు , “జర్నలిస్టులకు ఎక్కడ నుండి వార్తలు వస్తాయి మరియు వారికి ఈ అసత్య వార్తలను ఎవరు ఇస్తారో. నేను హైదరాబాద్‌లో నా ఇంటిని కొన్నప్పుడు అది నాకు బహుమతిగా భావించాను. నేను బెంగుళూరులో ఉండడానికి నా ఇంటిని అమ్మానని విన్నాను. దయచేసి ఊహాగానాలను ఆపి, నిజమైన వార్తలను రాయండి" అని రకుల్ పేర్కొన్నారు. 

 

రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో తన ఇంటిని అమ్మినట్లు తప్పుడు వార్తలను రాసిన జర్నలిస్టులపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో, రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ నుండి వెళ్లే ఆలోచన లేదని వెల్లడించారు. ప్రస్తుతం, ఆమె మంచి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ చివరిసారిగా బాలీవుడ్ చిత్రం మార్జావాన్ లో కనిపించింది, ఈ చిత్రంలో ఆమె వేశ్య పాత్రను పోషించింది, దీనికి మిలాప్ జావేరి దర్శకత్వం వహించారు. ఇక మన సౌత్ విషయానికి వస్తే, ఆమె రాబోయే భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2 లో నటిస్తున్నారు, ఇందులో కమల్ హాసన్ మరియు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు, ఈ చిత్రానికి 'రోబో 2.0' మరియు 'ఐ' ఫేమ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: