రీసెంట్‌గా గద్దలకొండ గణేష్ సినిమాతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి కమర్షియల్ సక్సస్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుణ్సినిమా చేస్తాడా అన్న మెగా అభిమానుల ఎదురుచూపులకు సమాధానంగా తన పదో సినిమా రీసెంట్‌గా ప్రారంభించాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఒక బ్యాగ్డ్రాప్ లో రూపొందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రినైసాన్స్ పిక్చర్స్ బ్యానర్పై సిద్ధు ముద్ద- అల్లు వెంకటేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మంచి ఫాం లో దూసుకుపోతున్న ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కిక్ బాక్సర్ గా కనిపించనున్నారు. వరుణ్ రోల్ గురించి మెగా అభిమానులకు ఇంతవరకూ తెలుసు. అయితే ఈ సినిమా కథాంశం ఎలా ఉండబోతోంది? ఈ కథ కు స్ఫూర్తి ఏదైనా ఉందా? అంటే కచ్ఛితంగా ఉందని వార్త ఒకటి బయటకు వచ్చింది. 

 

సినిమా కథకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'జానీ' స్ఫూర్తి అని తెలుస్తోంది. జానీ తరహాలోనే ఫుల్ ఎమోషనల్ గా ఉంటుందని తాజా సమాచారం. అయితే పవన్ స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాల్లో రకరకాల తప్పులు దొర్లడం వల్ల ఈ సినిమా గురించి అప్పట్లో ఆసక్తికరంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అలాంటి పొరపాట్లు లేకుండా అదే లైన్ తో బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ సినిమాని రూపొందిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జానీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కబోతోందన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. పవన్ తప్పులు ఇప్పుడు రిపీట్ కాకుండా అరవింద్ సమక్షంలో స్క్రిప్టును పక్కాగా తీర్చి దిద్దారట. కొత్త కుర్రాడే అయినప్పటికి కిరణ్ కొర్రపాటి ఈ సినిమాని ఎంతో ఛాలెంజింగ్ గా చిత్రీకరించేందుకు ప్రిపేర్ అవుతున్నాడట. 

 

ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు తండ్రిగా ప్రముఖ తమిళ నటుడు మాధవన్ నటించనున్నారని ఇటీవల ప్రచారమైంది. వరుణ్ తల్లి పాత్రలో వెటరన్ నటి రమ్యకృష్ణ నటిస్తారని మరో ప్రచారం కూడా మెగా ఫ్యాన్స్ కి వేడెక్కించింది. అయితే ఈ విషయాలను చిత్ర బృందం ఇంకా అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ సినిమా తో పాటు వరుణ్ మరో రెండు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ఆ విషయాలు కూడా త్వరలో వెల్లడి కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: