యంగ్ హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే కుమారి 21 ఎఫ్ మాత్రమే. మళ్ళీ ఆ రేంజ్ హిట్ కొట్టాలని ఎంత ట్రై చేసినా మన కుర్ర హీరోకి కుదరలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమా చూపిస్త మావా, లవర్, కిట్టూ ఉన్నాడు కాగ్రత్త, అంధగాడు..ఇలా వరుసగా సినిమాలు చేసినా అవన్ని యావరేజ్, ఫ్లాప్స్ గా మిగిలాయి. దాంతో ఈ కుర్ర హీరోకి కాస్త గ్యాప్ వచ్చింది. అయితే ఎట్టకేలకు మళ్ళీ దిల్ రాజు తన బ్యానర్ లో ఒక సినిమాకు చాన్స్ ఇచ్చాడు. దిల్ రాజు, శిరీష్, బెక్కం వేణుగోపాల్ కలిసి నిర్మిస్తున్న సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'. రాజ్ తరుణ్-షాలినీ పాండే హీరో హీరోయిన్స్ గా నటించారు. ముందు ఈ సినిమాని గల్లా అశోక్ తో లాంచ్ చేసిన దిల్ రాజు ఎందుకనో మధ్యలోనే డ్రాప్ చేశాడు. ఇదే సినిమాని రాజ్ తరుణ్ తో తీశాడు. ఇక ఈ సినిమాని ఒక టర్కీ సినిమా ఆధారంగా రూపొందించారు. 

 

ఇప్పుడు ఈ సినిమా సెన్సారు వ్యవహారాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతోంది. అంతేకాదు ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయాలన్నది దిల్ రాజు ఆలోచన. అయితే వెంకీమామ సినిమా వ్యవహారం ఎటూ తేలకుండా డైలమాలో వుండడంతో, ఇద్దరి లోకం ఒకటే డేట్ ను ప్రకటించడం లేదు. సెన్సారు చేయించి రెడీగా వుంచారు. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. వాస్తవానికి క్లీన్ యు సర్టిఫికెట్ రావాల్సిన సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'.

 

ఎందుకంటే ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాబట్టి. అయితే సినిమాలో సీన్ డిమాండ్ చేయడంతోనో లేక యూత్ కావాలనుకుంటారనో మాంచి లిప్ లాక్ ఒకటి వుందట. కథకు అది తప్పని సరి అని తెరకెక్కించారట. దాంతో లిప్ లాక్ వుండడంతో సినిమాకు ఏ కట్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చేసారు. దీంతో దిల్ రాజు కాస్త డిసప్పాయింట్ అయ్యాడట. ఒక్క లిప్ లాక్ దిల్ రాజుకు షాకిచ్చింది సెన్సార్ బృందం. ఇక ఈ సినిమాకి  కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు. ఇక దిల్ రాజు 2020 సంక్రాంతికి మహేష్ సరిలేరు సినిమాని నిర్మించి రిలీజ్ చేసున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్-సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వస్తున్న ఎంతమంచి వాడవురా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: