టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ప్రవేశించి పలు సినిమాల్లో అక్కడక్కడా చిన్న పాత్రల్లో నటించిన రష్మీ, మధ్యలో కొన్ని టెలివిజన్ కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి పేరు సంపాదించింది. ఇక ఆ తరువాత నాలుగు, ఐదు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించిన రష్మీ గౌతమ్, కొన్నేళ్ల క్రితం ఈటివి ఛానల్ లో ప్రారంభమైన జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక ఏడేళ్లుగా ఈటివి ఛానల్ లో ఎంతో దిగ్విజయంగా ప్రసారం అవుతున్న ఆ షో ద్వారా రష్మీ మంచి పేరు సంపాదించడంతో పాటు యూత్ లో మంచి ఫాలోయింగ్ మరియు క్రేజ్ దక్కించుకుంది అనే చెప్పాలి. 

 

ఇకపోతే నిన్న జరిగిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రాంలో అర్జున్ సురవరం మూవీ హీరో నిఖిల్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చి సందడి చేయడం జరిగింది. అయితే ఆ షో వేదికగా జరిగిన ఒక ఇన్సిడెంట్ తో రష్మీ ఫ్యాన్స్ నిఖిల్ పై మండిపడుతున్నారు. మ్యాటర్ లోకి వెళితే, షోలోకి ఎంటర్ అయిన తరువాత రష్మీ ని తదేకంగా చూస్తూ, ఈమె ఈ జబర్దస్త్ షోలో తన్మయినా లేక వినోదినినా అంటూ సెటైర్లు వేసాడు నిఖిల్, అంతటితో ఆగకుండా రష్మీ అంటే ఎవరో కూడా తనకు తెలియదు అంటూ కామెంట్ చేయడం జరిగింది. 

 

అయితే ఈ ఘటనతో కొంత లోలోపల ఇబ్బంది పడ్డ రష్మీ, ఆ తరువాత మామూలుగానే షోలో పార్టిసిపేట్ చేసింది. అయితే ఈ తాజా ఘటనపై రష్మీ ఫ్యాన్స్ నిఖిల్ సిద్దార్థ పై విపరీతంగా మండిపడుతూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం. రష్మీ అనేక షోల్లో పని చేయడంతో పాటు, పలు సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించిన విషయం నిఖిల్ కి తెలియదా అంటూ ఆగ్రహంగా కామెంట్స్ చేస్తుండగా, అదంతా షోలో భాగంగా సరదా కోసం నిఖిల్ చేసిన ఫన్నీ ట్రిక్ అని, కాబట్టి దానిని సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదని నిఖిల్ ఫ్యాన్స్ వారికి రిటార్ట్ ఇస్తున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: