స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్ని సరసన డిజే బ్యూటీ పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే సినిమా నుండి రిలీజైన 3 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

 

సామజవరగమన సాంగ్ అయితే 100 మిలియన్ వ్యూస్ తో ఏ సౌత్ సినిమా సాంగ్ కు రాని క్రేజ్ తెచ్చుకుంది. 2020 జనవరి 12న రిలీజ్ అవబోతున్న అల్లు అర్జున్ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే త్రివిక్రం టీజర్ ఫైనల్ చేయగా లీడ్ హీరో అల్లు అర్జున్ మాత్రం టీజర్ కట్ శాటిస్ఫై కాలేదని తెలుస్తుంది. టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని అన్నాడట బన్ని.

 

అందుకోసం ప్రత్యేకంగా మరో టీజర్ వేద్దామని త్రివిక్రం చెప్పినా దానికి బన్ని నో చెప్పాడట. రీసెంట్ గా మహేష్ సరిలేరు నీకెవ్వరు టీజర్ సెన్సేషన్ సృష్టించింది. అప్పటివరకు సైలెంట్ గా ఉన్న మహేష్ సినిమా బజ్ టీజర్ తో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది. అనీల్ రావిపుడి తన మార్క్ ఎంటర్టైనర్ గా సరిలేరు నీకెవ్వరుతో మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడని అనిపిస్తుంది.

 

అందుకే అల్లు అర్జున్ కూడా అల వైకుంఠపురములో టీజర్ లో కూడా మాస్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా రెండు ఫైట్ సీన్స్ పెట్టమని చెబుతున్నాడట. సినిమాలో ఫైట్స్ ఉన్నా త్రివిక్రం టీజర్ అంటే మాటలతో మెప్పించేస్తాడు.. థీం ను చెప్పి చెప్పక చెబుతాడు. అలానే ఈ సినిమా టీజర్ కూడా ఉంటుందట. మరి ఫైనల్ గా డైరక్టర్, హీరో కలిసి ఎలాంటి టీజర్ రిలీజ్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: