టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ సినిమా తర్వాత ఓ మెస్మరైజింగ్ సబ్జెక్ట్ తో నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి ప్రస్తుతం రెడీ అవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు పగలగొట్టి కొత్త రికార్డులు సృష్టించే బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక వసూలు చేసిన సినిమాలుగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో అదిరిపోయే మంచి కథాంశంతో రోమాలు నిక్కబొడుచుకునే లా స్టోరీ ఉన్న క్రమంలో కామెడీ కూడా అదే తరహాలో ఉండే విధంగా డైరెక్టర్ బోయపాటి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుమూలంగా ప్రస్తుతం బుల్లితెరపై టెలివిజన్ రంగంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ పై డైరెక్టర్ బోయపాటి కన్నేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ ని బాలకృష్ణ తో చేయబోయే సినిమాలో నటింప చేసే ఆలోచనలో బోయపాటి వున్నట్లు..అయితే ఈ ఆలోచన వెనుక రోజా ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే జబర్దస్త్ కామెడీ షో కి జడ్జి గా రోజా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.

 

ఈ నేపథ్యంలో బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో రోజా కూడా ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు దీంతో డైరెక్టర్ బోయపాటి కి జబర్దస్త్ కమెడియన్స్ తో కామెడీ చేపిస్తే త్వరగా తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతారని రోజా డైరెక్టర్ బోయపాటి సజెషన్ ఇవ్వడంతో ...బాలకృష్ణ తో చేయబోయే మూడవ సినిమాలో కామెడీ ట్రాక్ లో జబర్దస్త్ ఆర్టిస్టులను తీసుకునే ఆలోచనలో బోయపాటి వున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూవీ తో కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాలని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: