‘భరత్ అనే నేను’ మరియు ‘మహర్షి’ లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో మంచి జోరు మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టి తన ఫ్యాన్స్ కాలర్ మళ్లీ ఎగరటానికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం బాగా కష్టపడుతున్న టు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో సినిమాలో దాదాపు 13 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో నుంచి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి...మహేష్ బాబు తో నటించడంతో సినిమాపై మంచి హైప్ పెరిగింది. ముఖ్యంగా సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల నవంబరు 22వ తారీఖున రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మరియు అభిమానులను ఎంతగానో అలరించే విధంగా ఉండటంతో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.

 

 

తాజాగా అదే జోరు సోషల్ మీడియాలో ఈ సినిమాలో ఇటీవల విడుదలైన మొట్టమొదటి మాస్ సాంగ్ తో కొనసాగిస్తున్నాడు మహేష్ బాబు. విషయంలోకి వెళితే ఇటీవల విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మొట్టమొదటి సాంగ్ మైండ్ బ్లాక్ అనే మాస్ సాంగ్ తాజాగా ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయింది. అదరగొట్టే మాస్ బీట్ తో యూత్ మరియు మాస ని షేక్ చేసేలా దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసాడు. బ్లెజ్ మరియు రనిన రెడ్డి కలిసి పాడిన ఈ సాంగ్ కి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు.

 

ఇక ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో పలు రికార్డ్స్ నమోదు చేస్తూ ధూమోసుకెళ్తోంది. థియేటర్స్ లో ఈ సాంగ్ కు ఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయం అని అర్ధం అవుతోంది. ఇక చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాను జనవరి 11న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ అనుకున్న మ్యూజిక్ అంటే చాలా బాగా ఇచ్చారని ఈ మాత్రం ప్రమోషన్ ఉంటే చాలు మహేష్ బాబు రికార్డులు కొట్టడంలో బేరాలు ఉండవు అని అనటానికి అంటూ కామెంట్ చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: