టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం రెండు పాటల షూటింగ్ మినహా సినిమా మొత్తం కూడా కంప్లీట్ అయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా మహేష్ బాబు , దిల్ రాజు, అనిల్ సుంకర ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా అఫీషియల్ టీజర్ కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి స్పందనను రాబట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా నుండి మైండ్ బ్లాక్ అనే మాస్ మసాలా సాంగ్ ని నిన్న సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సాంగ్ ప్రస్తుతం యువత మరియు మాస్ ను విపరీతంగా ఊపేస్తూ, యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోతోంది. కాగా ఈ సాంగ్ లో చాలా ఏళ్ళ తరువాత మహేష్ బాబు ఊర మాస్ లుక్ లో కనపడనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. గళ్ళ లుంగీ, కూలింగ్ గ్లాసెస్, మాస్ షర్ట్ తో మహేష్ బాబు అదరగొట్టబోతున్నట్లు చెప్తున్నారు. 

 

కాగా ఈ సాంగ్ లిరిక్స్ ని బట్టి కూడా సాంగ్ ఈ విధంగానే ఉండబోతున్నట్లు  కొంతవరకు మనకు అర్ధం అవుతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మాస్ సాంగ్ లో మహేష్ తో కలిసి చిందేయబోతున్నట్లు చెప్తున్నారు. ఎప్పటినుండో మహేష్ నుండి ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నది ఇటువంటి పాటే అని, తప్పకుండా ఈ సాంగ్ రేపు రిలీజ్ తరువాత సరిలేరు నీకెవ్వరు థియేటర్స్ ని ఊపేయడం ఖయాం అని పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా మహేష్ బాబుకు ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: