జయాపజయాలని లెక్క చేయకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్. సందీప్ మొదటగా ప్రస్థానం సినిమాలో విలన్ గా చేసి ఎంతో మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా సినిమాలు చేస్తూ ఎక్కడా తన కెరీర్లో గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళంలో చిత్రాలు చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం సందీప్  తెలుగు తమిళంలో కలిసి ఐదు సినిమాలు చేస్తున్నాడు.

 

 

దాంట్లో ఒకటి సందీప్ నిర్మాణంలోదే కావడం విశేషం. ప్రస్తుతం అచ్చొచ్చొన హారర్ కామెడీ జోనర్ లో "నిను వీడని నేనే" అనే సినిమాతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కి బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ చెప్పుకోదగ్గదిగా మాత్రం నిలవలేకపోయింది. కానీ నిర్మాతగా సందీప్ కి లాభాలు తీసుకురాలేకపోయినా నష్టాలని మాత్రం మిగల్చలేదు.

 

 

సినిమా తర్వాత సందీప్ నుండి వచ్చిన చిత్రం "తెనాలి రామక్రిష్ణ". జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిమ ఈ సినిమాలో సందీప్ నటన మునుపటి సినిమాల కంటే భిన్నంగా ఉంటుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన  ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. అయినా కూడా సందీప్ చేతిలో సినిమాలు ఉన్నాయి. అటు నటుడిగా కొనసాగుతూనే బిజినెస్ మేన్ గానూ సక్సెస్ అవుతున్నాడు.

 

 

వివాహ భోజనంబు పేరుతో హోటల్ ని స్టార్ట్ చేసిన సందీప్ కెరీర్ కీ ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్పాలి. అయితే తన కెరీర్ ని చక్కగా దిద్దుకుంటున్న సందీప్ అమ్మా నాన్నల కోసమని బెంజ్ కార్ బహుమతిగా కొన్నాడు. ఈ మేరకు కారును కొన్న తర్వాత ఆ ఫోటోని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ కార్ ని మీరు కూడా చూసేయండి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: