యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... ప్రస్తుతం ఈ  హీరోని టాలీవుడ్ హీరో అనడంకంటే వరల్డ్ వైడ్ హీరో ఆడమే బెటర్ . ఎందుకంటే బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సాహో లాంటి ఆక్షన్ సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్  ఒక రేంజ్ లో  పెరిగిపోయింది. అయితే సాహో సినిమా తెలుగులో అంతగా ఆకట్టుకోలేక  పోయినప్పటికీ అటు బాలీవుడ్లో మాత్రం తడాఖా చూపించింది సాహో.  అక్కడ ఏకంగా 150 కోట్లకు పైగా రాబట్టింది ప్రభాస్ సాహో సినిమా. దీంతో సాహో సినిమాలో ప్రభాస్ కి అక్కడ క్రేజ్  కూడా బాగానే ఏర్పడింది. దీంతో అక్కడి దర్శకనిర్మాతలు కూడా  ప్రభాస్ తో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ కోసం కొన్ని కథలు రెడీ చేసుకున్నట్లు సమాచారం . అయితే డార్లింగ్ ప్రభాస్ మాత్రం అటు తెలుగు దర్శకులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు సమాచారం. 

 

 

 

 ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజ హెగ్డే నటిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆగిపోయింది. ఎందుకంటే సాహో విడుదల అయినప్పటికీ జాన్  షూటింగ్ జరుగుతుండటం  సాహో ఫ్లాప్ తో ప్రభాస్సినిమా కథలో కొన్ని మార్పులు చేయాలని భావించినట్లు తెలుస్తోంది.  రాధాకృష్ణసినిమా కథలో మార్పులు చేసే పనిలో పడ్డారట. ఇదిలా ఉంటే సాహో సినిమాతో బాలీవుడ్ లో రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలో డార్లింగ్ ప్రభాస్ కి బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

 

 

 బాహుబలి సాహో లాంటి సినిమాలు చూసిన తర్వాత నిర్మాత ఆదిత్య చోప్రా తన యాక్షన్ సినిమాలకు పర్ఫెక్ట్ ప్రభాస్ అని నమ్మి... నెక్స్ట్ ధూమ్ సిరీస్ లో విలన్ పాత్ర కోసం ప్రభాస్ ను అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాహో సినిమాలో ప్రభాస్ యాక్షన్ బాడీ చూస్తే ఫిదా అయిపోతారు బాలీవుడ్ ప్రేక్షకులు.. ప్రభాస్ లోని విలనిజాన్ని ఈ నిర్మాత క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సాహో ప్రభాస్ యాక్షన్ సీన్స్ చూసిన తర్వాత నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రభాస్ మాత్రం టాలీవుడ్ దర్శకులు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. కాగా తాను నటిస్తున్న జాన్ సినిమా హిందీలో కూడా విడుదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: