నట సింహం నందమూరి బాలకృష్ణతో ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాలను తెరకెక్కించి బాలయ్యకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. ఈ రెండు సినిమాలు బాలయ్య కెరీర్ లో మైల్ స్టోన్స్ గా మిగిలిపోయాయి. అంతేకాదు బోయపాటికి ఈ సినిమాలు తన హిట్ లిస్ట్ లో చేరిపోయాయి. ఇక ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్టైతే బాలయ్య-బోయపాటిది హ్యాట్రిక్ కాంబినేషన్ గా రికార్డ్ క్రియోట్ చేస్తుంది. ఇక బాలయ్య-బోయపాటి కాంబినేషన్ కి భారీ క్రేజ్ ఉండేది. కాని బోయపాటి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో తెరకెక్కించిన 'వినయ విధేయ రామ' దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది. దాంతో బోయపాటి కెరీర్ ముగిసిపోయింది అనుకున్నారు. కాని బాలయ్య ఎంతో నమ్మకం పెట్టుకొని బోయపాటికి ఒక ఛాన్స్ ఇచ్చాడు.

 

బాలయ్య పెట్టుకున్న నమ్మకాన్ని బోయపాటి నిలబెట్టుకుని హ్యాట్రిక్ హిట్ ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం తన పద్దతిని చాలా వరకు మార్చుకుంటున్నట్లుగా సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాను ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కించడంతో పాటు యాక్షన్ సీన్స్ విషయంలో కూడా వినయ విధేయ కు ఎదురైన చేదు అనుభవంను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

తన డైరెక్షన్ టీంలో ఉన్న పలువురు పాత వారిని తొలగించి కొత్త వాళ్ళను తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా మంచి రైటర్స్ ను బోయపాటి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. డైలాగ్స్ ను ఎంటర్ టైన్ మెంట్ గా రాయడంతో పాటు స్క్రీన్ ప్లేను ఆసక్తికరంగా సాగేలా రాసే వారికి ప్రాముఖ్యత ఇస్తూ తన టీంలోకి తీసుకుంటున్నట్లుగా లేటెస్ట్ న్యూస్. ఇక కామెడీ విషయంలో కూడా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని.. జబర్దస్త్ కమెడియన్స్ ను ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇంతగా బోయపాటి తన స్టైల్ ను తన టీంను మార్చినా అనుకున్న సక్సస్ ను అందుకుంటాడా లేదా అని కొంతమంది సందేహాలను వ్యక్తపరుస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: