డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. రామ్ కి ఈ సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పక తప్పదు. ఇస్మార్ట్ తో ఒక్కసారిగా రామ్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. అంతేకాదు మార్కెట్ కూడా బాగా పెరిగింది. దాంతో ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా మాంచి మాస్ సబ్జెక్ట్ నే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంతకముందు రామ్ తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమలసినిమా ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ కూడా ఎంతో ఆసక్తిగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమేకాదు అప్పుడే ప్రేక్షకుల్లో క్రేజ్ ని పెంచేసింది.

 

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ప్రాఫిట్ వచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్ నిర్మిస్తున్న సినిమా 'రొమాంటిక్'. ఈ సినిమాలో పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్నాడు. పూరి కథ, మాటలు అందించి, దర్శకత్వ బాధ్యతలు మాత్రం తన అసోసియోట్ అయిన కొత్త వ్యక్తి చేతిలో పెట్టారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ షెడ్యూల్ జరుగుతున్నప్పుడే ఇస్మార్ట్ బ్యూటి నిధీ అగర్వాల్ కూడా గోవా వెళ్ళి పూరీ టీం తో హంగామా చేసి వచ్చింది. ఇక లేటెస్ట్ విషయం ఏమిటంటే, ఈ సినిమాలో గెస్ట్ గా హీరో రామ్ కనిపించబోతున్నారు. ఓ ఆసక్తికరమైన చిన్న పాత్రలో రామ్ నటిస్తున్నాడు. రామ్ కెరీర్ ను ఒక్కసారిగా జంప్ చేయించాడు పూరి జగన్నాధ్. అందుకే ఆ స్నేహంతో రొమాంటిక్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించడానికి రామ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 

రొమాంటిక్ సినిమా స్టిల్స్ ఇప్పటికే బయటకు వచ్చి, సినిమాకు బాగానే క్రేజ్ ని తీసుకు వచ్చాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మించిన గ్లామర్ డోస్ ను రొమాంటిక్ సినిమాలో పూరి చూపించబోతున్నట్లు ఇప్పటి వరకు రిలీజైన స్టిల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రామ్ నటిస్తున్నాడు అని తెలిస్తే బిజినెస్ పరంగా ఈ సినిమాకు బాగా హెల్ప్ అవుతుంది. మరి మొదటిసినిమా మెహబూబా తో ఫ్లాప్ ని అందుకున్న ఆకాష్ ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమాని పూరి-చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: