సినిమా రంగంలో ఇంత మూర్ఖంగా ప్రవర్తించే వారిని నేనెప్పుడు చూడలేదని సినీ నటి షకీలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే ఆమె నటిస్తూ నిర్మించిన లేడీస్ నాట్ అలౌడ్ సినిమాను సెన్సార్ చేయడానికి సెన్సార్ బోర్డు రెండుసార్లు తిరస్కరించింది. అయితే ఈ సినిమాను సెన్సార్ చేయడానికి కొందరు వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని షకీలా ఆరోపించారు. ఈ విషయం పై సీనియర్ నటి షకీలా సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇకపోతే నటి షకీలా ఇటీవల నటించిన చిత్రం ‘లేడీస్ నాట్ అలవ్డ్’ చిత్రాన్ని సెన్సార్ బోర్డు తిరస్కరించడంపై.. ఆమె బోర్డు సభ్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. లేడీస్ నాట్ అలౌడ్ సినిమాను ఇప్పటికే సెన్సార్ బోర్డు రెండుసార్లు తిరస్కరించింది. ఏంతో కష్టపడి ఈ సినిమాకు పెట్టుబడి పెట్టాను. అసలు సెన్సార్ వాళ్లూ ఈ సినిమాను ఎందుకు తిరస్కరిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. ఈ జోనర్లో వచ్చిన ఎన్నో చిత్రాలకు సెన్సార్ ఇచ్చారు. కానీ మా చిత్రానికి మాత్రమే సెన్సార్ ఇవ్వడం లేదు. దీనికి గల కారణమేమిటి అని ఘాటుగా ప్రశ్నించారు?
ఇదే కాకుండా నా పేరు ఉండడం మీకు ఇష్టం లేదా? సాయి పేరు ఉండొద్దా ? మేమెంతో కష్టపడి, ఫైనాన్స్లో డబ్బులు తీసుకువచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సెన్సార్ పూర్తి చేయడానికి డబ్బులు అడుగుతున్నారని మా దర్శకుడు సాయి చెప్పారు. మమ్మల్ని ఇలా బ్రతకనివ్వరా..
చిన్న నిర్మాతలను మాత్రమే డబ్బులు అడుగుతారా? పెద్ద పెద్ద సినిమాలు చేసేవాళ్ల దగ్గర మాత్రం నయాపైసా తీసుకోరు. ఇకపోతే ట్రిబ్యునల్కి వెళితే ఎంతో ఖర్చు అవుతుంది. అందుకే మేము ముందే చెప్పాం మా చిత్రం ఫ్యామిలీ చిత్రం కాదు. ఇదొక అడల్ట్ కామెడీ సినిమా అని అయినా తప్పు ఎక్కడ జరుగుతుందో నాకు తెలుసు. నా దగ్గర అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. మీ మంచి కోసం వద్దని అనుకుంటున్నా’ అని షకీలా సెన్సార్ బోర్డులో ఉన్న కొందరిని హెచ్చరిస్తున్నట్లుగా మాట్లాడిందట..