టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్గా రూపొందుతోన్న మల్టీస్టారర్ `వెంకీమామ`. విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్పుత్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం ఇద్దరి హీరోల అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో...
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ - ``డిసెంబర్ 13న `వెంకీమామ`తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వారం పదిరోజులుగా యూనిట్ అందరిలో థ్రిల్లర్ సినిమాలా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ డిస్కషన్ నడిచింది. ఇప్పుడు మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. నా కెరీర్లో మనం, వెంకీమామ చిత్రాలు జ్ఞాపకాలు. రేపు ఎన్ని సినిమాలు వచ్చినా, వీటిని రీప్లేస్ చేయలేం. ప్రతి విషయంలో ఈ సినిమ పరంగా బెస్ట్గానే జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్లో పనిచేయడం నా కోరిక. లేట్గా జరిగినా లేటెస్ట్గా ది బెస్ట్గా జరిగింది. అది వెంకీమామ పక్కన చేయడం. ప్రేమమ్లో ఒక సీన్లో చేసేటప్పుడే చాలా ఎగ్జయిట్ అయ్యి చేశాను. ఈ సినిమాలో ప్రతి సీన్లో ఎగ్జయిట్గా చేశాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు ఆయన్నుండి నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్ను ఎంజాయ్ చేశాను. బాబీ ఓ మిలటరీ ఎపిసోడ్లో నన్ను కొత్త చూపించాడు.. ఈ సందర్భంగా తనకు థ్యాంక్స్. విశ్వప్రసాద్గారికి థ్యాంక్స్. రాశీతో కలిసి భవిష్యత్లో మరిన్ని సినిమాలు చేస్తాను. తమన్, ప్రసాద్ మూరెళ్లగారు, విజయ్మాస్టర్, రామ్లక్ష్మణ్ మాస్టర్, రవివర్మమాస్టర్ సహా అందరికీ థ్యాంక్స్`` అన్నారు.
రాశీఖన్నా మాట్లాడుతూ - ``నేను కూడా మీలాగే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. హీరోయిన్గానే కాదు, వెంకటేశ్ అభిమానిలా ఎదురుచూస్తున్నాను. చైతన్యతో పాటు వెంకటేశ్గారితో కలిసి నటిచండం హ్యాపీగా అనిపించింది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయన గొప్ప నటుడే కాదు.. గొప్ప వ్యక్తి. చైతుతో మనం తర్వాత కలిసి పనిచేస్తున్నాం. మామ, అల్లుడు మధ్య రిలేషన్ తెరపైనే కాదు, సెట్స్లోనూ చూశాను. బాబీగారు పాజిటివ్, కాన్ఫిడెంట్ ఫిలింమేకర్. ఆయన కారణంగానే నేను ఈ సినిమా చేశాను. తమన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అన్ని చక్కగా కుదిరాయి. డిసెంబర్ 13న విడులవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్గా, సెకండాఫ్ ఎమోషనల్గా సాగే చిత్రమిది`` అన్నారు.