రాశిఖన్నా ఇండస్ట్రీలో ఊహలు గుస గుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. యంగ్ హీరో నాగశౌర్య నటించిన ఈ సినిమాలో అతనితో జంటగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. నటుడు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా తర్వాత రాశి మరో యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన జోరు సినిమాలో నటించింది. అప్పటి నుంచి రాశీ జోరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈ సినిమాలోనే తను సింగర్ గాను ప్రూవ్ చేసుకుంది. జోరు సినిమాలో టైటిల్ సాంగ్ పాడి అందరిని ఆకట్టుకుంది. అప్పుడప్పుడు ఇలా సాంగ్స్ సింగుతూనే ఉంది. ఇక ఎన్.టి.ఆర్, రవితేజ, గోపీచంద్, సాయి ధరం తేజ్, నాగచైతన్య వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి హిట్స్ ని అందుకుంది. కానీ ఈ మధ్య రాశి స్పీడ్ కాస్త తగ్గింది. ప్రస్తుతం వెంకీమామా సినిమాలో చైతూకి జోడీగా నటిస్తోంది. 

 

ఇక రాశీఖన్నా కేవలం మంచి నటి మాత్రమే కాదు. మంచి గాయని కూడా...అని ఈపాటికే చాలాసార్లు నిరూపించుకుంది. తెలుగు స్పష్టంగా మాట్లాడడమే కాదు, తెలుగు పాటలను ఎప్పుడు హమ్ చేస్తూనే వుంటుంది. ఈ సరదాతోనే గతంలో కొన్ని సినిమాల్లో పాటలు పాడటం ఆ పాటలు మంచి హిట్టవడం తెలిసిందే. హీరోయిన్ గా సినిమాలు ఎలా వున్నా, పాటల పాడే చాన్స్ లు వస్తే మాత్రం అసలు వదులుకోదు. అసలు ఆ అవకాశం ఎవరు ఇస్తారో అని రాశీఖన్నా చూస్తూ వుంటుంది. అంత పిచ్చి రాశి కి పాటలు పాడటం అంటే.

 

లేటెస్ట్ గా అలాంటి అవకాశం మళ్లీ వచ్చింది. మారుతి డైరక్షన్ లో సాయి తేజ్ హీరోగా తయారువుతున్న ప్రతి రోజు పండగే సినిమాలో రాశీఖన్నా తన పాట తనే పాడేసింది. ఈ సినిమాలో రాశీఖన్నానే హీరోయిన్ గా నటించింది. అందువల్ల ఆమెపై చిత్రీకరించే పాటను ఆమె పాడేసినట్లే కదా మరి. థమన్ మ్యూజిక్ డైరక్టర్. థమన్ మ్యూజిక్ డైరక్టర్ అయిన కొత్తలో చాలా మంది చేత ప్రత్యేకంగా పాటలు పాడించేసాడు. ఇది కూడా కొత్త కాదు. గతంలో జవాన్ సినిమాలో థమన్ ఓ పాటను రాశీ చేత పాడించాడు. ఇప్పుడు మరోసారి ఆమెకు అవకాశం ఇచ్చాడు. అయితే రాశి ఫ్యాన్స్ మాత్రం ముందు మాకోసం వరుసగా సినిమాలు చేయొచ్చుగా...అది పక్కన పెట్టేసి ఈ పిచ్చేంటి నీకు..అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ రాశి సాంగ్స్ కి కూడా ఫ్యాన్స్ చాలామందే ఉన్నారనుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: