మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో మంచి సక్సస్ ను అందుకున్నాడు. ఎప్పటి నుంచో హిట్ కోసం చూస్తున్న సాయి కి ఆ సినిమా కాస్త ఉత్సాహాన్నిచ్చింది.దాంతో నెక్స్ట్ సినిమాకి మారుతి డైరెక్షన్ లో చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సాయి ధరమ్ తేజ్- రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ప్రతిరోజూ పండగే'. డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా ఊపందుకున్నాయి. అందులో భాగంగానే ఈ సినిమా థియోట్రికల్ ట్రైలర్ విడుదలచేశారు. అటు మెగా అభిమానులే కాక ప్రేక్షకులందరి నుంచి మంచి స్పందన దక్కుతోంది. శతమానం భవతి గుర్తొచ్చేలా ఉన్నప్పటికీ అదే విషయంపై తనకు తానుగా సెల్ఫ్ సెటైర్ వేసుకుని మరీ ప్రేక్షకులను మెప్పించాడు మారుతి.

 

ఇక ఈ ట్రైలర్ లో అందరినీ దృష్టిని ఆకర్షించిన మరో అంశం రాశి పోషించిన ఏంజెల్ ఆర్నా పాత్ర. ఈ సినిమాలో రాశి ఒక టిక్ టాక్ సెలబ్రిటీగా కనిపిస్తూ ఫుల్ కామెడీ పండించబోతోందని ఇప్పటికే మారుతి రివీల్ చేశాడు. ట్రైలర్ లో "ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావ్ ఆబ్బాయ్.. నాక్ నాక్ నాక్ నాకొద్దు" అంటూ రాశి ఖన్నా చెప్పిన డైలాగ్.. ఆ ఎక్స్ ప్రెషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం అడల్ట్ కంటెంట్ ఉన్న 'సృజన నాకొద్దు' వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు అలాంటి కంటెంట్ తోనే మారుతి కాస్త బూతు టచ్ ఇవ్వడం అందరికి కాస్త షాక్ గా అనిపిస్తోంది.

 

ఇది '7 చేపల కథ' వంటి సినిమా అభిమానులకు ఫుల్ ఫన్నే కానీ మహిళా సంఘాలు.. సంప్రదాయవాదులు ఈ 'నాక్ నాక్ నాక్' వ్యవహారానికి ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ టిక్ టాక్ ఎపిసోడ్ వివాదాస్పదం అయ్యే అవకాశాలు ఎక్కువగాగా ఉన్నాయని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మారుతి ఇది పసిగట్టి సినిమాలో ఆ సన్నివేశం లేకుండా ఎడిటింగ్ లో ట్రిం చేస్తాడా లేక పబ్లిసిటి వస్తుందని అలానే వదిలేస్తాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: