'మ్యాన్లీ' స్టార్ గోపీచంద్ వరుసగా ఫ్లాప్‌లతో సతమతం అవుతున్నాడు. ఇక తాజాగా నటించిన చిత్రం 'చాణక్య' కూడా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న గోపీచంద్ 'చాణక్య' సినిమా ఇచ్చిన షాక్ తో  నిరాశ పడిపోయారు. ఇక వరుసగా ఫ్లాప్స్ వస్తున్న ప్రతి హీరోకి సెకండ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ అనుకోని హిట్ కొడితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కానే అంటునారు సినీపండితులు...

 

 

ఇకపోతే ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ లకు కూడా ప్లాప్స్ తప్పలేదు. వారు కూడా వరుస పరాజయాల తరువాత 'బౌన్స్ బ్యాక్' అయి విజయాలు సాధించారు. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఉన్నాడు హీరో గోపీచంద్. సినిమా విషయంలో ఎంతగా కష్టపడినా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ఆయన ఖాతాలో పడటం లేదు.. ఇక రిలీజైన మొదటిరోజు పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా వసూళ్లని సరిగ్గా అందుకోలేకపోతున్నాయి. ఈ టైమ్ లో హీరో గోపిచంద్ హిట్ కొట్టేందుకు మరోసారి రెడీ అయ్యాడు.

 

 

లాస్ట్ టైమ్ ఎన్నో ఆశలతో చేసిన ‘చాణక్య’ కూడా నిరాశ పరచడంతో అయోమయంలో పడిన గోపీచంద్  మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందు డైరెక్టర్ తేజని నమ్ము కుంటున్నాడు. డైరెక్టర్ తేజతో చేసిన ‘జయం, నిజం’ సినిమాలు గోపీచంద్ కెరియర్ కి మంచి బ్రేక్ ని ఇచ్చాయి. ఇందులో విలన్ గా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈసారి హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లుగా ఫిలింనగర్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అదీ కాకుండా తేజ  కూడా సీత సినిమా తర్వాత వేరే ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు.

 

 

అంతేకాదు, బెల్లంకొడ శ్రీనివాస్ కి సీత సినిమాతో మంచి హిట్ ని అందించాడు కూడా. ఆ సినిమాని మినిమమ్ మార్కెట్ అయ్యేలా చేశాడు. ఇకపోతే ఇప్పుడు వీళ్లిద్దరి మద్యన అన్నీ కుదిరితే వచ్చే యేడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలైక్కే అవకాశముంది. గోపిచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో కూడా సినిమాని చేస్తున్నాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. కాగా ఈసినిమాలతో అయినా గోపీచంద్ మళ్లీ విజయాల ట్రాక్ లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: