ఇటివల మా టీవీ లో జరిగిన రియాలిటీ షో బిగ్ బాస్ సభ్యులు ఈ కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఒక్కొక  పార్టిసిపెంట్స్ ఎవరికీ వారు తమ పనులతో టీవీ కార్యక్రమాలతో బిజీ గా ఉన్నారు. జరిగిన కార్యక్రమంలో ఒకరితో ఒకరు కార్యక్రమం అనంతరం పార్టీ చేసుకోవాలని నిర్ణయంచుకున్నారు. అదే విదంగా ఫైనల్లో విజేతగా రాహుల్  రన్నర్ గా  శ్రీముఖి నిలవడం తో బిగ్ బాస్  కార్యక్రమం ముగింపు పలికింది.

తరువాత సభ్యులందరు ఏదో ఒక కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు కానీ విజేత రాహుల్ గెలిచాక అందరికి ఫోన్ చేసి మాట్లాడారని కానీ శ్రీముఖి మాత్రం ఫోన్ మాట్లాడలేదని ఫోన్ కట్ చేసింది అని మీడియా సందర్బంగా ప్రకటించాడు.  బిగ్ బాస్ షోలో ఉన్నంత కాలం తోటి సభ్యుడు రాహుల్‌తో గొడవ పడుతూ వీలున్నప్పుడల్లా రాహుల్‌ను నామినేట్ చేస్తూ కార్యక్రమాన్ని చూసే ప్రేక్షకుల్లో ఏదో ఒకరకమైన ప్రతిభ తో ప్రేక్షకుల మనుసులు  దోచుకొని  ముందుకు సాగి చివరికి రాహుల్‌తోనే పోటి పడి మూడవ సీజన్ రన్నరప్‌గా నిలిచింది.

బిగ్ బాస్ ఇంట్లో  ఉన్నంత కాలం శ్రీముఖి ఎక్కువగా బాబా బాస్కర్‌తోనె  ఉంటే రాహుల్ మాత్రం వరుణ్, వితిక, పునర్నవిలతో ఉండేవాడు. రెండు గ్రూపులుగా ఏర్పడి ఎప్పుడు గొడవ పడేవారు వీలైనప్పుడల్లా నామినేట్ చేసుకునేవారు.అయితే అదంతా మరిచిపోయినవారిద్దరూ  తాజాగా ఓ పార్టీలో సందడి చేశారని సమాచారం. దానికి సంబంధించిన ఓవీడియో శ్రీముఖి  తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఆ వీడియోలో శ్రీముఖి, రాహుల్, వరుణ్, వితికలు డ్యాన్స్ చేస్తూ సందడి చేసారు. చివరకు ఇద్దరు కలిసారని ఫాన్స్ వారి వీడియోస్ కి లైక్ చేసారు. చివరకు ఇద్దరు కలవడంతో కథ సుకాంతం అయినది. వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ సభ్యలందరికి పార్టీ ఇచ్చారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: