సినిమా అనేది కొందరికి ప్రాణం. మరికొందరికి కల వీటిని నెరవేర్చుకోవడానికి కష్టపడి ప్రొడ్యూసర్లని పట్టుకుని ఎంతగానో శ్రమకు ఓర్చి, సినిమా నిర్మిస్తే అది సెన్సార్ బోర్డ్ దగ్గర ఆగిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుందని ఇప్పటికే కొందరు చాలా భాధపడుతున్నారు. ఇదే కాకుండా ఇటీవల కాలంలో సెన్సార్ కారణంగా చాలా సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బోల్డ్, కాంట్రవర్షియల్ కంటెంట్తో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలంటే చాలా పరీక్షలకు తలవంచాల్సి వస్తోంది.
ఇదేకాకుండా కొన్ని సందర్భాల్లో సినిమాలోని కీలకమైన కంటెంట్ను పక్కన పెట్టి మరీ సినిమా రిలీజ్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ లాంటి వారు తరచుగా సెన్సార్ బోర్డ్పై ప్రత్యక్షంగా విమర్శలు చేయడమే కాకుండా ప్రస్తుతం ఉన్న సెన్సార్ విధానాన్ని ప్రశ్నించాడు. తాజాగా ఈ లిస్ట్లోకి ఓ బాలీవుడ్ నటుడు చేరాడు. అతనే వివేక్ ఒబెరాయ్..
ప్రస్తుత పరిస్దితుల్లో సెన్సార్ విధానం సరిగ్గా లేదని పేర్కొంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన సెన్సార్ అనేది అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ అని, ప్రేక్షకులకు తాము కోరుకునేది చూసే స్వేచ్ఛ ఉండాలన్నాడు. ఓటీటీ ప్లాట్ఫాంలకు సెన్సార్ అనేది ఉండకూడదని నా అభిప్రాయం అని తెలిపారు. ఇకపోతే మనం ఉంటున్న సమాజంలో సెన్సార్షిప్ అనేది నెగెటివ్ విషయం. సెన్సార్కు బదులుగా కొత్త రేటింగ్ విధానం ప్రవేశపెట్టాలి.
ఈ సినిమాలో అభ్యంతరకర భాష వినియోగించారు, సన్నివేశాలు ఉన్నాయి.. లాంటి విషయాలు తెలిసేలా రేటింగ్ విధానం ప్రవేశపెట్టాలి. 18 ఏళ్ల వయసులోనే దేశ నాయకున్ని ఎన్నుకునే హక్కు కల్పిస్తున్న మనం, ఏ సినిమా చూడాలి అనే నిర్ణయాన్ని వాళ్లకు ఇవ్వకపోవటం కరెక్ట్ కాదు అని అన్నాడు.. ఇకపోతే ప్రస్తుతం ఇన్ సైడ్ ఎడ్జ్ సీజన్ 2 ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వివేక్ ఒబెరాయ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్లో సంచలనంగా మారాయి..