టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ హిందూ పురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్లీ మూవీస్ వైపు దృష్టి పెట్టారు.  మొదట బోయపాటి తో ఓ మూవీలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.  కానీ సరైన కథ దోరకపోవడం... జై సింహా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన కేయస్ రవికుమార్‌తో కలిసి ఈయన మరోసారి వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్.. టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. దాన్ని మరోసారి నిరూపిస్తూ పక్కా మాస్ సినిమాతోనే వస్తున్నాడు నందమూరి నటసింహం.  ఈ మూవీలో బాలయ్య గెటప్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఈ గెటప్ హైలైట్ అయింది.  ఎవడికి రా ఫోన్ చేస్తున్నావ్.. అంటే ఫైరింజన్ కాదు ఆ ఫైర్ కే ఫోన్ చేస్తున్నా.. అనే డైలాగ్ తో మొదలైంది. 

 

 ‘ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే.. దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా’ అని బాలయ్య చెప్పిన డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది. ‘ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తొందరగా చావదు. వెంటాడి, వేటాడి చంపుద్ది’ అనే డైలాగ్ కూడా ట్రైలర్‌లో వినిపిస్తుంది. ఈ మూవీలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు.  లుక్ పరంగా మాస్, క్లాస్ గా కనిపిస్తున్నారు.  ప్రతి డైలాగ్ యాక్షన్ సీన్లు బీభత్సం సృష్టిస్తున్నారు.  బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీ సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు.

 

బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తుండగా.. భూమిక, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ నెల 20న ‘రూలర్’ సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ బయోపిక్ లాంటి మూవీ దారుణమైన ఫ్లాప్ తర్వాత మరో పవర్ ఫుల్ పాత్రతో బాలయ్య బీభత్సం చేస్తున్నారని ఫ్యాన్స్  తెగ సంతోషంలో ఉన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: