స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా  త్రివ్రికమ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం అల వైకుంఠపురములో... ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దపడుతుంది. ఈ క్రమంలో శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. ఐతే ఈ మూవీ టీజర్‌ను ఆదివారం రిలీజ్‌ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది. కానీ ఆ టీజర్‌ను డిసెంబర్‌ 11న విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్‌ ప్రకటించింది. ఐతే ట్రైలర్‌ రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ అవడంతో ఫ్యాన్స్‌ నిరుత్సాహ పడకుండా వారి కోసం టీజర్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

 

 

ఇకపోతే త్రివ్రికమ్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్‌. ఇప్పటికే తమన్‌ సంగీతం సమకూర్చిన సామజవరగమన, రాములో రాముల పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఈ మూవీలో అందాల భామ పూజా హెగ్డే.. స్టైలిష్‌ స్టార్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు  నెలకొన్నాయి. ఇదిలా ఉండగా అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ఇదివరకే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ చిత్రాలను అందించారు.

 

 

ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో.. ఇక అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఇక ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేథా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తుండగా  గీతా ఆర్ట్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని కలిసి నిర్మిస్తున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: