రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల భరత్ కమ్మ దర్శకత్వంలో నటించిన డియర్ కామ్రేడ్ సినిమాతో కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకున్నాడు. మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలు అందుకోవడంలో సినిమా చాలా వరకు విఫలం అయింది. ఇక ప్రస్తుతం విజయ్ రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. వాటిలో ఒకటి వరల్డ్ ఫేమస్ లవర్, రెండవది ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో నటిస్తున్న సినిమా. కాగా వాటి తరువాత విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 

 

పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి పూరి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. కాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ తో కలిసి పూరి మరింత భారీగా నిర్మించనున్నట్లు మొన్న వార్తలు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఇటీవల భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 

 

ఇటీవల కరణ్ జోహార్ నిర్మించిన బాలీవుడ్ వెబ్ సిరీస్, లస్ట్ స్టోరీస్ లో నటించిన కియారా, ప్రస్తుతం పలు సినిమాలు తన షెడ్యూల్ లో ఉన్నప్పటికీ, కరణ్ తో ఉన్న మంచి అనుబంధం వల్లన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా రూ. 60 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ పెట్టనున్నారని, అలానే ఈ సినిమాను మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలలో ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: