పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది తన కెరీర్ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి తరువాత తన సినీ జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో అంచనాల మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా, రిలీజ్ అనంతరం ఊహించని విధంగా అతి పెద్దగా డిజాస్టర్ గా నిలిచింది. కాగా దానితో తన రాజకీయ జీవితంలో పూర్తిగా బిజీ అయిన పవన్ కళ్యాణ్, ఇటీవల జనసేన పార్టీ తరపున ఆంధ్రా ఎన్నికల్లో పోటీ చేసారు. అయితే అజ్ఞాతవాసి ఘోరంగా ఫ్లాప్ కావడంతో ఎంతో హర్ట్ అయిన పవన్ ఫ్యాన్స్, 

 

తమ కోసం కళ్యాణ్ గారు ఒక మంచి సినిమాలో నటించాలని ఎప్పటినుండో కోరుతున్నారు. అయితే అప్పటి నుండి ఫ్యాన్స్ విన్నపాలు వింటున్న పవన్, ఎట్టకేలకు ఒక సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. ఇటీవల బాలీవుడ్ లో హిట్ అయిన పింక్ మూవీ తెలుగు రీమేక్ లో నటించడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బోనీ కపూర్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక కొద్దిరోజుల నుండి ఈ సినిమా కోసం భారీ కోర్ట్ సెట్టింగ్ కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

 

అయితే అందుతున్న సమాచారం ప్రకారం, రాబోయే కొద్దిరోజుల పాటు తన రాజకీయ కార్యక్రమాలతో పవన్ బిజీగా ఉండనుండడంతో, తొలి షెడ్యూల్ ని ఆయన లేకుండానే ప్రారంభించబోతున్నట్లు సమాచారం. సంక్రాంతి తరువాత అఫీషియల్ గా ప్రారంభం అయ్యే ఈ సినిమా రెండవ షెడ్యూల్ ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుందని, ఆ షెడ్యూల్ నుండి పవన్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారని సమాచారం. ఇక హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తి అయినట్లు టాక్. మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన రాబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు...... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: