టాలీవుడ్ లోకి బాలనటుడిగా పరిచయం అయిన మహేష్ బాబు ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు తెరకెక్కించిన రాజకుమారుడు మూవీతో హీరోగా మారాడు ప్రిన్స్ మహేష్ బాబు.  కెరీర్ బిగినింగ్ లో కొన్ని ఇబ్బందులు పడ్డా.. మురారి, పోకిరి, అతడు, ఒక్కడు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  శ్రీనువైట్ల తెరకెక్కించిన దూకుడు మూవీతో మాస్ హీరోగా దుమ్మురేపాడు మహేష్ బాబు.  ఓ వైపు సినిమాలు మరోవైపు యాడ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.  స్టార్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీతో వచ్చిన మహేష్ బాబు తర్వాత భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాడు.  

 

తాజాగా మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ రిలిక్స్, టీజర్ దుమ్మురేపాయి. ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ఈ సినిమాతో నటిగా గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదలౌతోంది. మహేష్ బాబు సరసన రష్మిక మందన మొదటిసారిగా నటిస్తోంది.

 

ఈ మూవీలో మహేష్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన నటించిన విషయం తెలిసిందే.  అతి తక్కువ సమయంలో స్టార్ హీరో సరసన నటించిన అదృష్టం దక్కించుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా రష్మిక మాట్లాడుతూ.. మొదటి సారిగా మహేష్ బాబు తో నటించడం చాలా  కొంత ఎగ్జైట్ గా ఉందని చెప్పింది. ఈ సినిమాలో మహేష్ బాబుతో డాన్స్‌  ఉండడంతో ఆ డ్యాన్సుల విషయంలో తాను సరితూగగలనో లేదో తెలీడం లేదని, అందుకే తన వంతుగా రిహార్సల్స్ మీద ఎక్కువ దృష్టిపెట్టానని చెబుతోంది.  ఆయన హ్యూమరీజం, తోటివారితో చేసే సందడి చాలా బాగుంటుందని.. డైలాగ్స్ విషయంలో ఆయన తో పోటీ పడటం కష్టమంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: