మాములుగానే పవన్ మీద ఎప్పుడు సెటైర్స్ వేస్తూ వచ్చే ఆర్జివి ఇప్పుడు తను తీసిన సినిమాలో మరోసారి టార్గెట్ చేశాడు. ఆర్జివి తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా రిలీజ్ చేశారు. నిన్నటి వరకు సెన్సార్ సమస్యలతో సతమతమైన ఈ మూవీ ఈరోజు రిలీజ్ క్లియరెన్స్ వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ఈ సినిమా మొదటి షో పడినట్టు తెలుస్తుంది.

 

సినిమాలో మెయిన్ టార్గెట్ బాబోరిని చేసిన వర్మ సందట్లో సడేమియా అన్నట్టుగా మనసేన అధినేతను వేసేసుకున్నాడు. అచ్చుగుద్దినట్టుగా పవన్ లా ఉండే అతన్ని సెలెక్ట్ చేసి మరి ఆ పాత్రని పండించాడు. అయితే పాత్ర ఎలా ఉన్నా అతని మీద వర్మ చూపించిన సెటైరికల్ వే ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా విజయవాడ మీటింగ్ లో ఇక్కడ రొడీయిజం చచ్చిపోయింది కాని ఫ్యాక్షనిజం పుట్టుకొచ్చింది అంటాడు.

 

తన మనసేన సైనుకులను ఉద్దేశించి రేపు మీ అందరికి పెళ్లి నేను చేస్తానంటూ తన పెళ్లిల్ల మీద పంచ్ వేశాడు ఆర్జివి. అయితే మనసేన అధినేత మాట్లాడుతుంటే కేవలం స్టేజ్ మీద తన వెనుక ఉన్న వాళ్లు తప్ప జనాలు ఎవరు ఉండరు. అంటే దీనర్ధం పవన్ మీటింగులకు లక్షల మంది వస్తారు కాని అతనికి ఓట్లు మాత్రం ఎవరు వేయరన్నట్టుగా చూపించాడు.

 

మొత్తానికి వర్మ ఈ సినిమాతో తనకు టార్గెట్ అయిన అందరి మీద పంచులేశాడు. ముఖ్యంగా బాబు, చినబాబు, పవన్ ల మీద ఆర్జివి ఈ రేంజ్ లో ఎటాక్ చేయడం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. సినిమా మొత్తం ఇలానే నడుస్తుంది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వర్మ నుండి వచ్చిన మరో సెన్సేషన్ అని చెప్పొచ్చు. తప్పకుండా ఇది వర్మ ఫ్యాన్స్ కు నచ్చేలా అందరిని డైరెక్ట్ ఎటాక్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: