టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకివ్వరు. వరుసగా తన కెరీర్లో అన్నీ విజయాలే అందుకుంటూ దూసుకుపోతున్న అనిల్, ఈ సినిమాతో కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బండ్ల గణేష్, శ్రీనివాస రెడ్డి, సుబ్బరాజు, వెన్నెల కిషోర్

 

రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ ని జరుపుకున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం మహేష్ బాబు మరియు తమన్నాల పై ఒక ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలోని తన అనుభవాల పై హీరోయిన్ రష్మిక నేడు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పంచుకుంది. 

 

మహేష్ బాబు ఎంత పెద్ద సూపర్ స్టార్ అనేది అందరికి తెలుసునని, అయితే ఈ సినిమాలో ఒక పాట చిత్రీకరణ సమయంలో ఆయనతో కలిసి డాన్స్ చేయాలంటే కొంత భయం వేసినట్లు చెప్పింది. కాగా ఆ సాంగ్ లో నటించే సమయంలో ఎలా వ్యవహరించాలి, దానితో పాటు సెట్లో మనం షూటింగ్ చేస్తున్న సమయంలో మిగతావారి పట్ల ఎలా ఉండాలి తదితరాలన్నీ కూడా అయన నుండి తాను నేర్చుకున్నానని, ఎంత ఎదిగినా ఒదిగిపోయే క్యారెక్టర్ మహేష్ గారిది అని రష్మిక చెప్పడం జరిగింది. ఇక ఆయనను ఎంతో అభిమానించే వ్యక్తిగా తాను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పింది ఈ యువ భామ. కాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: