నిజ జీవితంలో మామా అల్లుళ్ళైన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటించిన సినిమా
'వెంకీ మామ'. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ లో ఈ సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయిన సంగతి తెల్సిందే. టాలీవుడ్లో ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా సరైన హిట్ సినిమాలు లేకపోవడంతో మంచి సినిమా రాకకోసం జనాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు దగ్గుబాటి, అక్కినేని హీరోలు.. అందులోనూ నిజజీవితంలో మామ, అల్లుడు కలిసి నటించిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకీ మామ ఖచితంగా ప్రేక్షకుల అంచానాలను అందుకోవడం గ్యారెంటీ అనుకున్నారు. ముఖ్యంగా నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు.
అయితే అందుకు తగ్గట్టుగానే వెంకీ మామ టీజర్, ట్రైలర్, సాంగ్స్..ఇలా అన్నీ వెంకీ మామ సినిమా మీద భారీగా అంచనాలను పెంచాయి. ఎఫ్ -2 తో అటు వెంకటేష్, మజిలీ తో ఇటు నాగ చైతన్య, జై లవ కుశ సినిమాతో దర్శకుడు బాబీ... సక్సెస్ లను అందుకొని ఉండడంతో ఈ సినిమా పక్కా హిట్ అని అందరూ ఫిక్సైయ్యారు. అంతేకాదు ఇద్దరు హాట్ హీరోయిన్లు రాశీ ఖన్నా, పాయల్ రాజ్పుత్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచారు.
ఇక ఇప్పుడు సినిమాకు ప్రీమియర్లు పడడంతో బిలో యావరేజ్ టాక్ వచ్చింది. అటు వెంకీ ఫ్యాన్స్, ఇటు చైతూ ఫ్యాన్స్ కి కాస్త నిరాశ తప్పలేదు. దాంతో కామన్ ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు సినిమా అని టాక్ వస్తోంది. సినిమా ఫస్టాఫ్ ఓ ఒకే గా ఉన్నప్పటికి... సెంకడాఫ్ లో బాబీ బాగా డిసప్పాయింట్ చేశాడని సినిమా చూసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా బాబీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడట. అంతేకాదు స్క్రీన్ ప్లే కూడా నత్త నడకగా సాగడం ప్రేక్షకులు సహనానికి పరీక్షలా మారిందట. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల వరకే రు. 30 కోట్ల బిజినెస్ అయిందని ప్రచారం సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ రు. 36 కోట్లు మాత్రమే దాటిందట. మరి ఈ టాక్తో అంత భారీ టార్గెట్ ఎలా రీచ్ అవుతుందోనని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. మరి ఈ వెంకీమామ నిర్మాతను గట్టెక్కిస్తాడా లేద మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.