ప్రస్తుత సమాజంలో మగవాడు ఏ విధంగా మృగంగా ప్రవర్తిస్తున్నాడో అదేవిధంగా ఆడది కూడా ప్రవర్తిస్తుంది అని అనటానికి నిదర్శనం ఈ సంఘటన. కట్టుకున్న మొగుడిని అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కసాయిగా చంపించింది ఈ మూర్ఖురాలు. విషయంలోకి వెళితే కృష్ణా జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి హేమలత పెళ్లి చేసుకోవడం జరిగింది తరువాత నగరానికి వలస రావటం జరిగింది. దీంతో పని నిమిత్తం హైదరాబాద్ నగరంలో ప్రగతి నగర్ లో రిటైర్డ్ ఉద్యోగి అయిన వెంకటేశ్వర్ రెడ్డి ఇంటిలో వారిద్దరికీ పని దొరకడం జరిగింది. అయితే ఇంటిలో వెంకటేశ్వర్ రెడ్డికి నాగరాజు భార్య హేమలత మధ్య వివాహేతరబంధం ఏర్పడటంతో ఈ విషయం నాగరాజుకి తెలియటంతో పలు సార్లు గధించి భార్యను హెచ్చరించిన...ఆ ఇంటిలో నుండి మకాం మార్చిన భార్య హేమలత ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో చాలాచోట్ల నాగరాజు మకాం మార్చడం జరిగింది.

 

అయినా గాని హేమలత ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ...తనకి వెంకటేశ్వర్ రెడ్డి మధ్య భర్త నాగరాజు అడ్డుగా ఉంటున్నాడని మొగుడిని చంపించడానికి ప్రియుడు రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్ రెడ్డి తో పన్నాగం పన్ని నాగరాజుని చంపించాలని చూసింది. ఈ ప్రయత్నంలో భాగంగా రెండు సార్లు నాగరాజు తినే ఆహారంలో విషం కలపాలని భావించిన హేమలత ధైర్యం చేయలేక పోయింది. దీంతో అతడిని హత్య చేసేందుకు బీదర్, వాడిచెల్కాపూర్‌ ప్రాంతానికి చెందిన మాపన్న అనే వ్యక్తి రూ.లక్షకు సుపారీ ప్రియుడు రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్ రెడ్డి ఇచ్చాడు. పథకం ప్రకారం ఈ నెల 10న నాగరాజును బీదర్‌ సమీపంలోని బాల్కి ప్రాంతానికి తీసుకెళ్లిన వెంకటేశ్వర్‌రెడ్డి మాపన్నతో అతడిని హత్య చేశారు.

 

అనంతరం మృతదేహంపై టర్పెంటాయిల్‌ పోసి నిప్పంటించారు. అయితే సమాజం మరియు బంధువులు కళ్ళు కపాలని పోలీసులకు ఈనెల 11న తన భర్త మిస్సింగ్ అయినట్లు కేసు పెట్టడం జరిగింది. అయితే పోలీసుల డౌట్  రావడంతో తమదైన శైలిలో హేమలత ని విచారించగా...దిమ్మ తిరిగే షాకింగ్ నిజాలు వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇద్దరు నేరం అంగీకరించారు. ఇదిలా ఉండగా హేమలతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వెంకటేశ్వరెడ్డికి ఆమెకు ప్రగతినగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో  ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తెలిసింది. హత్య ఏ విధంగా చేశారు అన్న దానిపై నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లి ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: