దేశవ్యాప్తంగా శృంగార బామ్మ సెక్సీ బాంబ్ సన్నీ లియోన్ కి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వున్న సంగతి అందరికీ తెలిసినదే. గూగుల్లో దేశంలోనే ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీగా సన్నీ లియోన్ చాలాసార్లు రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇటువంటి సన్నీలియోన్ తో టాలీవుడ్ కుర్ర హీరో నవదీప్ కి ఫ్లాట్ అయినట్లు ఇందుకోసమే నవదీప్ తో ఓ వెబ్ సిరీస్ చేయటానికి రెడీ అయినట్లు టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. నవదీప్ టాలీవుడ్ ఇండస్ట్రీలో 'జై' సినిమాతో డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మొదటి సినిమాతో మంచి విజయం సాధించిన నవదీప్ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా లభించకపోవడంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోల పక్కన పాజిటివ్ మరియు నెగిటివ్ సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ కెరియర్ ని ప్రస్తుతం కొనసాగిస్తూనే ఉన్నారు.

 

ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ మొదటి భాగం లో వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇచ్చి బాగా టెలివిజన్ ప్రేక్షకులను నవదీప్ ఆకట్టుకున్నాడు. అటువంటి బిగ్ బాస్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ నవదీప్ సన్నీలియోన్ తో రాగిణి MMM వెబ్ సిరీస్ లో నవదీప్ ఒక ముఖ్య పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన వార్త ఇప్పుడు సౌత్ లో వైరల్ గా మారింది. సీజన్ 1 తో రాగిణి MMS మంచి సక్సెస్ టాక్ ని అందుకుంది.  దీన్ని ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు, త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారట.

 

తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి మరో సీక్వెల్ లో నవదీప్ సన్నీలియోన్ తో రొమాన్స్ చేయనున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఫోటోలు దిగి తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మరోపక్క నవదీప్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'అల వైకుంఠ పురంబులో' సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: