స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస విజయాల మీద ఉన్న సమయంలో 'నా పేరు సూర్య' లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా కెరియర్లో పడటంతో తీవ్ర నిరుత్సాహం చెంది నెక్స్ట్ సినిమా చేయడానికి చాలా టైం తీసుకున్నారు. తర్వాత తనకు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ ‘అలా వైకుంఠపురం లో’ సినిమా కి సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ‘అలా వైకుంఠపురం లో’ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ‘అలా వైకుంఠపురం లో’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే...తర్వాత సినిమా సుకుమార్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన షూటింగ్ పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసేశాడు అల్లు అర్జున్.

 

ఇదిలా ఉండగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో నాగబాబు కూతురు నిహారిక కి ఒక వైవిధ్యమైన క్యారెక్టర్ రోల్ బన్నీ దగ్గరుండి ఇప్పించడం కోసం టాప్ యాంకర్ ని పక్కన పెట్టినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చినా ‘రంగస్థలం’ సినిమా లో రంగమ్మత్త క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్… సుకుమార్ అల్లు అర్జున్ సినిమాలో ఉందట. అయితే ఈ క్యారెక్టర్ కి ముందు అనసూయని తీసుకోవాలని సుకుమార్ భావించిన… ఆ క్యారెక్టర్ కి నిహారిక అయితే బాగుంటుందని సినిమాకి కూడా కొంచెం బజ్ వస్తుందని బన్నీ తెలపడంతో సుకుమార్ వెంటనే నిహారిక కి రంగమ్మత్త లాంటి పాత్ర బన్నీ సినిమా లో డిజైన్ చేసినట్లు ఫిలిం నగర్ లో వార్తలు వినపడుతున్నాయి.

 

సినిమా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కబోయే అదిరిపోయే మాస్ సినిమా స్టోరీ అని టాక్. అంతేకాకుండా గంధపు చెక్కలు స్మగ్లింగ్ తరహాలో లారీ డ్రైవర్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ నటిస్తున్నారని ఫిలింనగర్ లో టాక్. ఈ సినిమాలో బన్నీ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: