సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సంబరాలు మెదలుపెట్టారు. ఎందుకంటే ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, టైం ప్లేస్ కన్‌ఫర్మ్ చేశారు చిత్ర యూనిట్. సినిమా విడుదలకు సరిగ్గా ఆరు రోజుల ముందు జనవరి 5న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీగా ఈ వేడుకను జరపనున్నారు. ఈ హాట్ న్యూస్ ని ఆదివారం చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జనవరి 5న సాయంత్రం 5.04 గంటలకు ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమవుతుందని తెలిపారు.

 

మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే షూటింగ్‌ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

ఇక ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ లేడీ అమితాబ్ విజయశాంతి. దాదాపు 13 ఏళ్ల తరవాత ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. మహేష్ సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ ఇమేజ్ కూడా సినిమాకు బాగా కలిసొస్తోంది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, బండ్ల గణేష్, అజయ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.‘ఎఫ్2’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకరసినిమా నిర్మిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: