బాలీవుడ్ కండల వీరుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకపక్క 'దబాంగ్ 3' సినిమా చేస్తూనే మరో పక్క బిగ్ బాస్ యాంకర్ గా చేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరియర్ ని లాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో దబాంగ్-3 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్ చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. కాగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ బయట పెట్టిన సీక్రెట్ తో ఇండియన్ క్రికెట్ టీమ్ ఉలిక్కిపడినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియా వర్గాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ప్రస్తుతం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే మ్యాచులు జరుగుతున్నాయి.

 

దీంతో జరుగుతున్న ఈ సిరీస్‌లో భాగంగా బ్రాడ్‌కాస్టర్స్‌ అధికారికంగా నిర్వహించిన ప్రీ-మ్యాచ్‌ షో పాల్గొన్న సల్మాన్‌.. తన అభిమాన క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని అని పేర్కొన్నాడు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన ధోనినే తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని తెలిపాడు. అతనొక ‘దబాంగ్‌ ప్లేయర్‌’ అంటూ కితాబిచ్చాడు. సల్మాన్ ఇచ్చిన జవాబు కి ఇండియన్ క్రికెట్ టీమ్ సభ్యులు ఉలిక్కి పడ్డారట. సాధారణంగా సల్మాన్ ఖాన్ ఎప్పుడు కూడా క్రికెట్ ఆట గురించి స్పందించిన దాఖలాలు లేవు. అటువంటిది తనకి ధోని అంటే ఇష్టమని చెప్పటంతో ఇండియన్ టీం షాక్ కి గురైనట్లు సమాచారం. 

 

ఇక ధోని మినహాయించి చూస్తే తనకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన క్రికెటర్‌ కేదార్‌ జాదవ్‌ అని అన్నాడు. మరోపక్క ఎంఎస్ ధోని వరల్డ్ కప్ మ్యాచులు అయిపోయిన తర్వాత నుండి జట్టుకు చాలా దూరంగా ఉంటున్నాడు కుటుంబానికి దగ్గరగా ఉంటూ సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటున్నాడు. ఇప్పటివరకు మాత్రం తన రిటైర్మెంట్ విషయమై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఎంఎస్ ధోని. కాగా వచ్చే ఏడాది జరగనున్న టి20 వరల్డ్ కప్పు జట్టులో ధోని ఆడే అవకాశం ఉన్నట్లు దానికి సంబంధించి ప్రకటన జనవరిలో బీసీసీ ప్రకటించనున్నట్లు సమాచారం. మరోపక్క భారత్ క్రికెట్ టీమ్ అభిమానులు ధోనీ ప్రకటన విషయమై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: