ఈ సంక్రాంతికి తెలుగులో రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "సరిలేరు నీకెవ్వరు" చిత్రం జనవరి 11  వ తేదీన రిలీజ్ అవుతుండగా, స్టైలిష్ స్టార్ బన్నీ నటించిన "అల వైకుంఠపురములో" చిత్రం జనవరి 12 వ తేదీన విడుదల అవుతోంది. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు సతిష్ వేగేశ్న దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా "ఎంత మంచివాడవురా"  అనే చిత్రం కూడా విడుదల అవుతోంది.

 

అయితే ఈ మూడు చిత్రాలలో ప్రచారంలో పోటీ పడుతోంది రెండు పెద్ద సినిమాలే.  అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఇద్దరి హీరోల అభిమానులు సైతం సొషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో ముందుంది మాత్రం "అల వైకుంఠపురములో" సినిమానే. ఈ సినిమా మొదటి నుండి ప్రచారాన్ని చాలా పకడ్బందీగా నిర్వహిస్తోంది.

 

సామజవరగమనా పాట మొదలుకుని ఇప్పటి వరకు ప్రమోషన్లలో తనదైన పద్దతిని ఫాలో అవుతోంది. ఇప్పటి వరకు మూడు పాటలు, ఒక టీజర్ రిలీజ్ చేసిన టీమ్ మరోసారి మరో పాటతో సిద్ధం అవుతోంది. అయితే ఈ మూడు పాటలు జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయాయి. ఈ పాతలతోనే సినిమాకి చాలా హైప్ వచ్చింది. ఆ హైప్ ని అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది అల వైకుంఠపురములో టీమ్.

 

ప్రస్తుతం ఈ సినిమా నుండి బుట్టబొమ్మ అనే పాట రిలీజ్ అవుతోంది. అయితే డైరెక్ట్ గా పాటని రిలీజ్ చేయకుండా పాట టిజర్ ని రిలీజ్ చేసి జనాల్లో ఆసక్తిని పెంచేలా చేస్తున్నారు. మొదటి పాట రిలిజ్ నుండి ఇదే ఫార్ములాని పాటిస్తోంది ఈ టీమ్. టీజర్ సమయంలో కూడా ముందుగా టీజర్ ని రిలీజ్ చేసింది. మరి రిలీజైన మూడు పాటలు సూపర్ హిట్ అయినట్టు బుట్ట బొమ్మ పాట కూడా ప్రేక్షకులని ఆకర్షిస్తుందో లేదో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: