టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’.   టాలీవుడ్ లో వరుసగా తనదైన కామెడీ ముద్ర వేసుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి స్టిల్స్, లిరిక్స్, టీజర్ కి సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది.  దూకుడు తర్వాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ లో కడుపుబ్బా నవ్వించబోతున్నట్టు తెలుస్తుంది.  ఈ మూవీలో మహేష్ బాబు మొదటి సారిగా సైనికాధికారి పాత్రలో కనిపిస్తున్నారు.  దేశాన్ని కాపాడే బాధ్యతాయుతమైన సైనికుడు సమాజంలోని అవినీతిపరులపై ఎలాంటి పోరాటాన్ని సాగించాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.  

 

దిల్‌రాజు సమర్పణలో రామవూబహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అనిల్‌రావిపూడి దర్శకుడు. రష్మిక మందన్న కథానాయిక.  విజయశాంతి కీలక పాత్రధారి. జనవరి 11న విడుదలకానుంది. ఈ మద్య రిలీజ్ అయిన రెండు పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఈ రోజు సాయంత్రం సినిమాలోని మూడో పాట  విడుదల కానుంది. సాయంత్రం 5:04 గంటలకు `హీ ఈజ్ సో క్యూట్` పాటను విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో రష్మిక సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా చాలా క్యూట్ గా కనిపిస్తుంది. 

 

మహేష్ బాబు హీరోగా  రష్మిక కథానాయికగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ ప్రేక్షకులలో మూవీపై అంచనాలు పెంచింది. దేవి శ్రీ సంగీతం కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుందని పోస్టర్‌లో తెలిపారు. ఆ రోజు బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురవడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: