టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ముందునుండి నువ్వానేనా అన్నట్టుగా చిరంజీవి మరి బాలకృష్ణ సినిమాలు పోటాపోటీగా రిలీజ్  అయ్యేవి. ఇదే క్రమంలో అభిమానులు కూడా నందమూరి వర్సెస్ మెగా అన్నట్టుగా ఎవరికి వారు తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలైన సందర్భంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరికి వారు భారీ కటౌట్లు కట్టేవాళ్ళు. అటువంటిది బాలయ్య సినిమాలో చిరంజీవి చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం బాలయ్య బాబు 'రూలర్' అనే సినిమా విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో చిరంజీవి కొరటాలతో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇటువంటి తరుణంలో బాలయ్యతో సినిమాలో చిరంజీవి అంటే అందరూ కన్ఫ్యూజ్ అవ్వటం గ్యారెంటి.

 

విషయంలోకి వెళితే అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కధ ఆధారంగా ‘మహానటి’ అనే సినిమా చేయడం జరిగింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ అనే డైరెక్టర్ దర్శకత్వం వహించడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి కచ్చితంగా నాగ్ అశ్విన్ తో సినిమా చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టారు. ఆ సందర్భంలో నాగ్ అశ్విన్ జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ పై వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ వార్తలని వైజయంతి సంస్థ ఖండించింది.

 

తాజాగా మరో ఆసక్తికర ప్రచారం వైరల్ అవుతోంది. నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఆసక్తికర కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్ మెషీన్ నేపథ్యంలో ఓ కథని నాగ్ అశ్విన్ సిద్ధం చేస్తున్నాడట. అయితే నాగ అశ్విన్ ఈ స్టొరీ తో ముందుగా బాలకృష్ణతో చేయాలని భావించారట కానీ చిరంజీవితో చేయటానికి ఇష్టపడుతున్నట్లు ఈ నేపథ్యంలో సినిమా స్టోరీ కు ఎంత బడ్జెట్ అవసరమవుతోంది..విజువల్స్, గ్రాఫిక్స్ లాంటి టెక్నికల్ అంశాలు ఏమేరకు అవసరం అవుతాయి.. ఈ కథ వర్కౌట్ అవుతుందా అనే ప్రాధమిక అంశాలపై నాగ్ అశ్విన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: