సన్నిహిత వర్గాలు చెబుతున్న ప్రకారం.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఘాడంగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తుంది. గీత గోవిందం సినిమా తరువాత వీరిద్దరి మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని, అందుకే స్క్రీన్ పై వారి రొమాన్స్ అంతగా పడిందని అంటున్నారు. గతంలో రష్మిక.. కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపింది. ఆపై వారి లవ్వాయణం నిశ్చితార్థం వరకు వెళ్లింది. కానీ వారి వివాహం జరగబోతుందన్న సమయానికి... విజయ్ తో రశ్మికకు పరిచయం ఏర్పడిందట. అందుకే ఆ వివాహం ఆగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.


అయితే ఒకరోజు విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్న ఏజెంట్ ఆత్రేయ సినిమాను చూసినట్లు సమాచారం. సినిమా చూసిన తరువాత జూబ్లీ హిల్స్ లోని ఒక కేఫ్ లో సమయాన్ని గడిపారని తెలుస్తుంది. అయితే వీరిద్దరితో సహా ఇతర హీరోస్ ఉన్నారట. విజయ్ దేవరకొండ ఎక్కడకి వెళ్లినా.. అక్కడికి రష్మిక వస్తుందట. తన కొత్తింటి గృహప్రవేశం వేడుకలకి ఎవరిని పిలవని విజయ్, రష్మిక ని మాత్రం స్పెషల్ గా పిలిచాడు. అప్పుడే ఈ కన్నడ భామ విజయ్ కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందట. కొంతమంది వీళ్లిద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహం మాత్రమేనని నమ్ముతున్నా.. వారు లవ్ చేసుకుంటున్నారని, త్వరలోనే పెళ్ళి దండలు మార్చుకుంటారని టాలీవుడ్ తో సహా శాండల్ వుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.


ఏదేమైనా, వెండి తెరపై భార్యభర్తలుగా కనిపించి ఫాన్స్ మనసులు దోచుకున్న వీళ్ళు నిజజీవితంలో కూడా పెళ్ళి చేసుకుంటే కోట్ల మంది సంతోషపడతారు. ఇకపోతే.. విజయ్, రష్మిక రిలేషన్ గురించి క్లారిటీ రావాలంటే.. ఎవరో ఒకరు స్పందించక తప్పదు. డీపీవీర్ లాగా ఓపెన్ అవుతారో.. చైతూ, సామ్ లాగా గోప్యంగా వారి లవ్ ని సీక్రెట్ గా ఉంచుతారో చుడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: