కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కాజల్ అగర్వాల్ అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోల స‌ర‌స‌న జ‌త క‌ట్టింది. ముఖ్యంగా అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. సినీ నటి కాజల్ అగర్వాల్‌కు సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇక తాజాగా  కాజల్ అగర్వాల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. 

 

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు తాజాగా కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ శాఖలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌కు సంబంధించిన కొలతలు కూడా తీసుకున్నారు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు. కాగా, సెలబ్రెటీల రూపాలను మైనపు బొమ్మలుగా చేసి ప్రాణం తప్ప అన్ని ఛాయలు కనిపించేలా చేసే మేడమ్ టుస్సాడ్స్ ఇప్పటికే ఎంతో మంది భారత సెలబ్రటీల బొమ్మలను ప్రజెంట్ చేసింది.

 

మన దక్షిణాది విషయానికొస్తే.. తొలిసారిగా ప్రభాస్.. ఈ మ్యూజియంలో మైనపు బొమ్మగా స్థానం సంపాదించాడు. ఆ తర్వాత మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో కొలువైన మేడమ్ టుస్సాడ్స్‌లో రీసెంట్‌గానే పెట్టారు. ఇక ఇప్పుడు కాజల్ అగర్వాల్ బొమ్మను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. నిర్వాహకులు కాజల్ నుంచి కొలతలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువు తీరనున్న కాజల్ అగర్వాల్ ఈ సందర్భంగా తన ఆనందం వ్యక్తం చేస్తోన్న కాజల్ అగర్వాల్.
  

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: