సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా సినిమా 'దర్బార్'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ జోడీగా నయనతార నటిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు ఇక ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటి అంటే 1992లో పాండ్యన్ అనే సినిమా తర్వాత రజనీకాంత్ మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తలైవాను ఢీ కొట్టే విలన్ పాత్రలో సునీల్ శెట్టి నటించాడు. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
ఇప్పటికే విడుదలైన ఈ ‘దర్బార్’ మూవీ టీజర్కు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్ ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీగా రజినీకాంత్ అభిమానులను దృప్టిలో పెట్టుకుని దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ ‘దర్బార్’ మూవీని తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఈ సినిమాను సుబస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కూడా చిత్ర నిర్మాణంలో భాగస్వామి. అయితే తమిళంతో పాటు తెలుగు, హిందీలో 2020 జనవరి 9న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. ఇదిలా ఉంటే.. దర్బార్ చిత్రానికి తెలుగులో మాత్రం క్రేజ్ నిల్గా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు కరువైనట్టు తెలుస్తోంది. గత సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడం కారణంగానే దర్భార్ సినిమాకు క్రేజ్ పోయింది.. చివరకు మురుగదాస్ ఉన్నా కాపాడలేని స్థితి ఏర్పడింది. ఒకవేల అదృష్టం కలిసొచ్చి హిట్ అయినా.. సంక్రాంతి పోటీ నేపథ్యంలో వసూళ్లు వచ్చే ఛాన్స్ లేదు. అందుకే ఎవ్వరూ కొనడం లేదు అన్న టాక్ వినిపిస్తోంది.