బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్  దబంగ్ -3 రిలీజ్ ప్రచారంతో అంతటా హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీలున్న ఏ వేదికను భాయ్ విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే  దబాంగ్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన రెండు భాగాలు భారీ కమర్షియల్ సక్సస్ లు అందుకున్న నేపథ్యంలో దబంగ్ -3 పై రెట్టింపు అంచనాలతో బరిలో దిగుతోంది. తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా స్టార్ స్పోర్స్ట్ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్.. దబంగ్ విలన్ కిచ్చా సుదీప్ హాజరయ్యారు. ఈ వేదికపై తనకిష్టమైన ఆటగాడు ఎం.ఎస్.ధోని అని సల్మాన్ అన్నారు. అంతే కాదు ధోనీ దబంగ్ ప్లేయర్ అంతే... ఎవరికైనా ఎనీ డౌట్ అంటూ ఫ్యాన్స్ ని ప్రశ్నించాడు. 

 

దీంతో సల్మాన్ వ్యాఖ్య  సోషల్ మీడియాలో జోరుగా ట్రోల్ అవుతోంది. క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ ని అనతి కాలంలోనే దక్కించుకున్న క్రికెటర్ ధోనీ. మాజీ సారథి..  ఆల్ రౌండర్  కపిల్ దేవ్ తర్వాత ఇండియాకి  కెప్టెన్సీ విభాగంలో వరల్డ్ కప్ తెచ్చిన ఘనత ధోని సొంతం. అలా కోట్లాది మంది హృదయాల్లో ధోనీ లెజెండరీగా ఖ్యాతికెక్కాడు. ఆ పేరును భాయ్ తెలివిగా దబంగ్ -3 కోసం వాడేస్తున్నాడు అంటూ నెటి జనులు ఫైరవుతున్నారు. ప్రచారంలో రాంగోపాల్ వర్మనే మించిపోయేలా ఉన్నాడు అంటూ ఫన్నీ కామెంట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

దబాంగ్-3 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. అటు ప్రచారంలోనూ భాయ్ హీటెక్కిస్తున్నాడు. సల్మాన్ క్రేజీ చిత్రానికి ప్రముఖ కొరియో గ్రాఫర్ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించడంతో దక్షిణాది ప్రేక్షకులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. తెలుగులో రూలర్.. ప్రతిరోజూ పండగే సినిమాలతో పోటీపడుతూ దబాంగ్ రిలీజవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక తెలుగులో పోకిరి గా వచ్చిన మహేష్ బాబు బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ని ప్రభుదేవా సల్మాన్ తో వాంటెండ్  గా తెరకెక్కించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: