సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు చెబితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలవడం ఎలాగూ పక్కా. అభిమానుల గుండెలు ఆనందంతో పొంగిపోతాయి. టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌతిండియా వైడ్ మహేష్ బాబును ఆరాధించే అభిమానులు ఉన్నారు. టాప్ హీరోగా వరుస మూవీలతో దూసుకుపోతున్న హీరో ప్రిన్స్ మహేష్.. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసత్వంతో టాలీవుడ్లో అడుగు పెట్టాడు. టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచిన రాజకుమారుడిగా.. అమ్మాయిల మదిలో యువరాజుగా తనదైన నటనతో కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోంగ్ పెంచుకున్నారు.
ఇక మహేష్ రూపంతోనే కాదు తన నటన, డైలాగ్ డెలవరీతో కూడా అదరగొట్టేస్తాడన్న సంగతి తెలిసిందే. ఏ డైలాగ్ అయినా చాలా సింపుల్గా చెబుతాడు. మహేష్ చెప్పిన డైలాగ్ లు ఎన్ని సంవత్సరాలు అయినా ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయిపోతాయి. ఉదాహరణకు పోకిరి సినిమాలో `ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.` అన్న డైలాగ్ ఇప్పటికీ ఎంత ఫేమస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ డైలాగు చాలా సింపుల్గా రెండే రెండు పదాలతో ఉంటుంది. కానీ ఈ డైలాగ్ మహేష్ చెప్పిన విధం తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా చేసింది. వాస్తవానికి మహేష్ సినిమా డైలాగులు చాలా సింపుల్గా.. పవర్ఫుల్గా ఉంటాయి.
అలాగే `గుర్తుపెట్టుకో నీకంటే తోపు ఎవడూ లేడిక్కడ , నీకు ఏది అనిపిస్తే అది చేయ్, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు, నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ థి 11th మైల్. కోడితే దిమ్మ తిరిగిపోవాలి..చల్.` ఈ సన్నివేశంతో ప్రేక్షకులు శ్వాస తీసుకోవడం మర్చిపోయి చూడాల్సిందే. నిజానికి సినిమాలో సీరియస్ సన్నివేశాల్లోనూ మహేష్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి. మురారిలో హీరోయిన్ను ఆటపట్టించినా.. భరత్ అనే నేను సినిమాలో సీఎంగా అసెంబ్లీలో డైలాగ్స్ పేల్చినా.. ఆ మార్దవ కంఠంతో వచ్చే డైలాగులు పేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. కాగా, ప్రస్తుతం ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.