బాలీవుడ్ ఇండస్ట్రీ ఫోకస్ ఇప్పుడు ఎక్కువగా  టాలీవుడ్ ఇండస్ట్రీ పై పడింది. బాహుబలి సినిమా పుణ్యమా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ఎస్.ఎస్.రాజమౌళి రూపంలో మారుమ్రోగిపోయింది. ఇటువంటి తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ లేని హీరోలు రీమేక్ చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక మ్యాజిక్కులు కొత్త కొత్త రికార్డులు సృష్టించడం తో చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు ప్రముఖులు టాలీవుడ్ కథలపై మరియు హీరోల పై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. రోజురోజుకీ టాలీవుడ్ ఇండస్ట్రీకి మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థలు టాలీవుడ్ లో టాప్ హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టడం స్టార్ట్ చేశాయి.

 

ఇటువంటి నేపథ్యంలో వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉండటంతో త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయడానికి రెడీ అయిన నేపథ్యంలో ఆ సినిమాని నిర్మించడానికి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే కొన్ని నిర్మాణ సంస్థలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి క్యూ కడుతుంటే తాజాగా మహేష్ బాబు తో కూడా సినిమాలు చేయడానికి మరికొన్ని బడా నిర్మాణ సంస్థలు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాణ సంస్థలు ప్రస్తుతం మెల్లమెల్లగా వస్తున్నాయి.

 

అంతేకాకుండా వంశీ పైడిపల్లితో మహేష్ బాబు చేయబోయే సినిమా మహేష్ ఒప్పుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు ఫోకస్ మొత్తం అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా పై ఉంది. ఈ సినిమా రిజల్ట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ సినిమా ఏమిటి అన్నది స్పష్టం చేయనున్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: