టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గడిచిన గత ఏడాదిన్నరలో రిలీజ్ చేసిన తన రెండు సినిమాలతో కూడా సూపర్ డూపర్ హిట్స్ అందుకోవడం జరిగింది. కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి ఊపుమీదున్న సూపర్ స్టార్ కు, వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తోడై, ఆయనతో ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేటితో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మహేష్ ప్రక్కన గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, సత్యదేవ్, శ్రీనివాస రెడ్డి, రావురమేష్, సంగీత, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, 

 

వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి 5న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో గ్రాండ్ గా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ విషయమై మూడు రోజుల క్రితం సినిమా యూనిట్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఇకపోతే నేడు ఈ ఫంక్షన్ కు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక కీలక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రానున్నారని, 

 

నేడో లేక రేపో సినిమా యూనిట్ ఆయనను ప్రత్యేకంగా వెళ్లి కలిసి ఆహ్వానించడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి వెళ్లి మెగాస్టార్ ని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.ప్రస్తతం పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త పై సరిలేరు యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్తే కనుక నిజం అయితే ఇటు మెగా, అటు ఘట్టమనేని ఫ్యాన్స్ కి ఇది పండుగ వార్తే అని చెప్పాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: