టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత అలీ తల్లి జైతున్‌ బీబీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే నిన్న అనగా బుధవారం రాత్రి జైతున్‌ బీబీ తన సొంత ఇంట్లో తుది శ్వాస విడిచారు. జైతున్‌ బీబీ స్వస్థలం రాజమహేంద్రవరం. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ నిమిత్తం నటుడు అలీ రాంచి లో ఉన్నారు. అయితే జైతున్‌ బీబీ తన స్వస్థలంలో కన్నుమూశారనే వార్త తెలియగానే అలీ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు.

అలీ బంధువులు జైతున్‌ బీబీ భౌతికకాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ కు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం జైతున్‌ బీబీ అంత్యక్రియలు హైదరాబాద్ లో జరగనున్నాయి.

https://www.instagram.com/p/B6OpqdVlTZz/?igshid=bn3isp71ta95


అలీ భార్య జుబేదా సుల్తానా బేగం... జైతున్‌ బీబీ మరణవార్తను ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియపరిచారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో 'మిస్ యు అమ్మ' అని పేర్కొని అలీ, తన తల్లి జైతున్‌ బీబీ కలిసి ఉన్న ఒక ఫోటో ని జత చేసి పోస్ట్ చేశారు.

అలీ కి తన అమ్మగారు అంటే చచ్చేంత ఇష్టం. ఎన్ని సినిమా షూటింగ్ లు ఉన్నా.. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. తన తల్లితో ప్రతిరోజూ కొంత సమయం మాట్లాడుతుంటారు. అలాగే అనేక సందర్భాలలో... తాను అంత స్థాయిలో ఉండడానికి తన అమ్మ జైతున్‌ బీబీ, తండ్రి కారణమని చెప్పారు. స్టార్ కమెడియన్ అయినప్పటికీ.. సామాన్యుడు వలె తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమానురాగాలతో ఆలీ చూసుకునేవారు. ఇప్పటికే తన తండ్రి పేరిట ఎన్నో సామాజిక కార్యక్రమాలను అలీ చేస్తున్నారు.

ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతి రావు మరణించి ఇంకా వారం రోజులు కాకముందే మరొక టాలీవుడ్ యాక్టర్ ఇంట విషాదం జరగడం చాలా బాధాకరం. జైతున్‌ బీబీ ఆత్మకు శాంతి చేకూరాలని మనం కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: