మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్ ఆ మధ్యంతా వరుస పరాజయాలతో సతమతమైయ్యాడు. ఇదే కాకుండా తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుసగా 6 ఫ్లాపులు ఫేస్ చేసిన సాయి ఎట్టకేలకు ‘చిత్రలహరి’తో కుదుటపడ్డాడు. బాక్సాఫీస్ని షేక్ చేసే సక్సెస్ కాకపోయినా.. సాయితేజ్కి ఆర్టిస్ట్గా మంచి శాటిస్ ఫ్యాక్షన్ని ఇచ్చింది ఈ ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈ నేపథ్యంలో.. తన తదుపరి చిత్రం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు తేజ్.
ఇకపోతే రెమ్యూనరేషన్ విషయానికి వస్తే విన్నర్ టైంలో రు.30 కోట్ల మార్కెట్ ఉన్న మనోడు వరుసగా ఫ్లాపులు పడటంతో చిత్రలహరితో రు.10 కోట్లకు సరిపెట్టుకున్నాడు.. ఇకపోతే ఇప్పుడు తాజాగా పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేసిన ‘చిత్రలహరి’ తర్వాత మారుతి డైరెక్షన్లో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతి రోజూ పండగే’ అనేందుకు సిద్ధమవుతున్నాడు సాయితేజ్. ఇక రాశిఖన్నా జంటగా మారుతి డైరెక్షన్ లో వస్తోన్న సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్రలో నటించారు. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై ఇప్పటికే తేజ్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి..
ఇక కధ విషయానికి వస్తే ఇదొక తాత, మనవడి కథ. ఐదు వారాల్లో తాతయ్య మరణిస్తాడని తెలిశాక... ఆయన్ను సంతోషంగా ఉంచడానికి మనవడు ఏం చేశాడన్నదే చిత్రకథ అని తెలుస్తుంది. ఇక చిత్రలహరి సినిమా కోసం బరువు పెరిగిన సాయి ధరం తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ కోసం దాదాపు 20 కేజీలు తగ్గాడట..
అంతే కాకుండా ఈ సినిమాలో ‘హోమం’ చేస్తున్నప్పుడు వచ్చే ఓ సన్నివేశంలో ఫైట్ సీన్ కోసం షర్ట్ విప్పాల్సి ఉందట అప్పుడు మాత్రం ఆ సీన్లో సిక్స్ప్యాక్తో కనిపించానని అంటున్నాడు..ఇకపోతే టైటిల్లో ఉన్న పాజిటివిటీ రిజల్ట్ లోనూ రిఫ్లెక్టయ్యి.. సాయితేజ్కి సాలిడ్ హిట్ దక్కుతుందేమో చూడాలి. లేదంటే సాయి ధరం తేజ్ పరిస్దితి మొదటిలా మారుతుందను కుంటున్నారు..