టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. ఇక దీని తరువాత మహేష్ బాబు, 

 

ఇటీవల మహర్షి తో తనకు మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం సింహాచల పుణ్యక్షేత్రానికి ప్రత్యేకంగా విచ్చేసిన వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, తన తదుపరి సినిమా దిల్ రాజు గారి బ్యానర్ లో ఉంటుందని, అలానే దానిలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబే హీరోగా నటిస్తున్నారని చెప్పారు. కాగా ఆ సినిమా మంచి మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు టాక్. మహేష్ బాబు ఆ సినిమాలో ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇకపోతే దాని తరువాత మహేష్ బాబు, గీత ఆర్ట్స్ వారి బ్యానర్ లో నటించనున్నారని తెలుస్తోంది. 

 

ఇటీవల ప్రతిరోజు పండగే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాసు మాట్లాడుతూ, మహేష్ బాబు గారితో గీత ఆర్ట్స్ లో ఒక సినిమా ఉంటుందని, వచ్చే ఏడాది అది ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరు, ఎటువంటి సినిమా అనే తదితర వివరాలన్ని కూడా రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నట్లు చెప్పారు. సో ఈ విధంగా సరిలేరు తరువాత మహేష్ బాబు తన 27, 28వ సినిమాలను కూడా పక్కాగా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ కనుక నిజమే అయితే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది పండగ వార్తే అని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: