మెగా మేనల్లుడిగా  అల్లు వారి అబ్బాయి గా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఓవైపు మెగా బ్యాక్ గ్రౌండ్... మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా.. అల్లు శిరీష్ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చినపటికి సత్తా  చాటుకోలేకపోయాడు. నటన పరంగా కూడా మంచి మార్కులు ఎక్కడ వేసుకోలేక పోయాడు అల్లు శిరీష్. అయితే అల్లు శిరీష్ చేసిన సినిమాల్లో ఒకటి రెండు విజయాలు సాధించినప్పటికీ.. అల్లు శిరీష్ కెరీర్లో చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం ఇప్పటి వరకు నమోదు కాలేదు. మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోలందరూ దూసుకుపోతుంటే అల్లు శిరీష్ మాత్రం ఇంకా వెనుకబడి పోయాడు. 

 


 ఇంకా సరైన సక్సెస్ కోసం స్టార్ డమ్  కోసం పరుగులు తీస్తూనే ఉన్నాడు అల్లు శిరీష్. కథల ఎంపిక విషయంలో అల్లు శిరీష్ సరిగా ఆలోచించక పోవడం వల్ల అల్లు శిరీష్ కెరీర్లో ఇప్పటి వరకు సరైన విజయాన్ని అందుకోలేక పోయారు. అయితే ఇటీవలే సాయి ధరమ్ తేజ్ కూడా కథల విషయంలో కాస్త గాడి తప్పడం తో చిరంజీవి సాయి ధరంతేజ్ కెరియర్ ని సెట్ చేసే పనిలో పడ్డ విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ సినిమాలకు సంబంధించి ముందుగా కథలను చిరంజీవి విన్న తర్వాత ఓకే చేస్తున్నారు. ఇక ఇప్పుడు శిరీష్  కెరీర్పై కూడా చిరంజీవి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

 


 శిరీష్ కోసం చిరంజీవి కథలు వింటున్నారట . గతంలో తన అల్లుడు కళ్యాణ్ హీరోగా చేసిన విజేత సినిమాకి దర్శకత్వం వహించిన రాకేష్ శశి వినిపించిన ఓ కథ  మెగా స్టార్ చిరంజీవికి బాగా నచ్చిందట. అయితే విజేత సినిమా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ ఆ దర్శకుడు వినిపించిన కథ మాత్రం చిరంజీవికి నచ్చిందట. ఈ కథకీ చిరంజీవి ఓకే చెప్పాడట. దీంతో త్వరలో అల్లు శిరీష్ ఈ ప్రాజెక్టులో నటించనున్నట్లు తెలుస్తోంది. మరి చిరంజీవి ఎంట్రీ ఇచ్చాక అయినా అల్లు శిరీష్ మంచి విజయం సాధిస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: